కడ్తాల్, మే 12:కులవృత్తుల అభ్యున్నతికి రాష్ట్ర సర్కార్ కృషి చేస్తున్నదని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం కడ్తాల్ మండలంలోని ముద్విన్ గ్రామంలో ఏర్పాటు చేసిన నీరా పైలట్ ప్రాజెక్ట్ కేంద్రాన్ని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని తాటి వనంలోకి వెళ్లి నీరా తీసే చెట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గీత కార్మికులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కుల వృత్తిని కాపాడుకుంటున్నారని, దీన్ని గమనించిన సర్కార్ నీరాను గౌడ కులస్తులే విక్రయించేలా జీవో తీసుకొచ్చిందన్నారు. అంతేకాకుండా పింఛన్లు, ప్రమాదవశాత్తు మరణించినవారి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తున్నదన్నారు. 4కోట్ల తాటి, ఈత మొక్కలు నాటి పెంచుతున్నట్లు తెలిపారు. నీరా ఉత్పత్తులను ప్రజలకు అందించాలనే ఆలోచనతో హైదరాబాద్లో రూ.10 కోట్లతో జూన్ 2 నుంచి నీరా స్టాళ్లను అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. నీరాతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు.
కుల వృత్తులను కాపాడటమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని, దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం మండలంలోని ముద్విన్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీరా పైలట్ ప్రాజెక్ట్ కేంద్రాన్ని ఎమ్మె ల్యే జైపాల్యాదవ్, రాష్ట్ర ఎక్సైజ్శాఖ కమిషనర్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ముద్విన్ గ్రామంలోని తాటి వనంలోకెళ్లి నీరా తీసే చెట్లను పరిశీలించారు. గ్రామంలోని నీరా పైలట్ ప్రాజెక్ట్లో నీరా తయారీని చీఫ్ సైంటిస్టులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని కుల వృత్తులకు అధి క ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా కులవృత్తుల వారికి సబ్సిడీ పథకాలను అందజేసి ప్రోత్సహిస్తున్నదని కొనియాడారు.ఉమ్మడి రాష్ట్రంలో మసకబారిన కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నా రు. నీరాను గౌడ కులస్తులే విక్రయించేలా ప్రభుత్వం జీవో తీసుకొచ్చిందన్నారు. గతంలో ఉన్న తాటి, ఈత చెట్లపై ఉన్న పన్నులను ప్రభుత్వం రద్దు చేయడంతోపాటు గీత కార్మికులకు పింఛన్లు, ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి జారి పడి మరణిస్తే మృతుడి కుటుంబానికి రూ.ఐదు లక్షల పరిహారాన్ని అందిస్తుందన్నారు.
రాష్ట్ర ప్రజలకు నీరాను అందించేందుకు రం గారెడ్డి జిల్లాలోని ముద్విన్ గ్రామంలో.. యాదాద్రి జిల్లాలోని నందనం, సర్వేల్ గ్రామాల్లో.. సంగారెడ్డి జిల్లా మునిపల్లి గ్రామాల్లో నీరా తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం రూ.10 కోట్లతో ఏర్పాటు చేస్తున్న నీరా స్టాళ్లను జూన్ 2న హైదరాబాద్లోని ట్యాంక్బండ్ వద్ద ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. నీరాలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో కల్తీ కల్లును అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నదని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
అసత్య ప్రచారాన్ని మానుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని మానుకోవాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నా రు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగుతున్నదన్నారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
బీజేపీ మతాలు, కులాల మధ్య చిచ్చుపెడుతుండగా.. కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం పాకులాడుతుందని విమర్శించారు. ఈ ప్రాంతంలో బీసీ నాయకుడిగా చెప్పుకునే ఓ నేత, బీసీ మంత్రినైనా తనపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. అనంతరం ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం గీత కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటున్నదన్నారు.
నీరా పైలట్ ప్రాజెక్ట్తో ఈ ప్రాంతానికి గుర్తింపు వచ్చిందన్నారు. అంతకుముం దు మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ నీరాను తాగి.. తాటి ముంజల రుచి చూశారు. అనంతరం ఇరువురిని గౌడ సంఘం మండల నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అదనపు కమిషనర్ అజయ్రావు, డిప్యూటీ కమిషనర్ డేవిడ్వ్రికాంత్, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు రవీందర్రావు, సత్యనారాయణ, అరుణ్కుమార్, ఏఈఎస్ హన్మంత్రావు, జీవన్కిరణ్, సీఐలు వేణుకుమార్, సత్యనారాయణ, శ్రీధర్, శ్రీనివాస్రెడ్డి, వీణారెడ్డి, వేణుగోపాల్రెడ్డి, రామకృష్ణ, ఉపేందర్, ఎస్ఐ లు, జడ్పీటీసీ దశరథ్నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ గిరియాదవ్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, పీఏసీఎస్ చైర్మన్ భాస్కర్రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పరమేశ్, సర్పంచ్లు యాదయ్య, లక్ష్మీనర్సింహారెడ్డి, భారతమ్మ, భాగ్యమ్మ, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, రాములు, నిర్మల, వీరయ్య, ఎక్సైజ్శాఖ సిబ్బంది పాల్గొన్నారు.