నవాబుపేట, మే 12: సాధారణంగా ప్రతి మూడు నెలలకు ఒక్కసారి జరిగే మండల సర్వ సభ్య సమావేశం గురువారం నవాబుపేట ఎంపీపీ కాలె భవాని అధ్యక్షతన నిర్వ హించారు. సమావేశానికి ఎమ్మెల్యే యాదయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాలు బాగానే అమలవు తున్నాయని అందులో ఎలాంటి నిర్లక్ష్యం వహించిన అధికారులపై తగిన చర్యలు తీసుకో నున్నట్లు తెలిపారు. మండలంలోని గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో సంబంధిత అధికారులు చురుకుగా పనిచేయాలన్నారు. ఏదైనా గ్రామంలో అభివృద్ధి పనుల నిమిత్తం నిధులు సరిపోని సందర్భంగా ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.ఐదులక్షలను మంజూరు చేస్తానని సభాముఖంగా హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మండల వ్యవ సాయ అధికారి మాట్లాడుతూ 2021-2022 సంవత్సరానికి గానూ రైతు బంధు పథకం యాసంగి కింద 14704 మంది రైతులకు 15,30,02,942 రూపాయలు జమచేశామని తెలిపారు.
పశు వైద్యాధికారి మాట్లాడుతూ ఇప్పటి వరకు గడ్డి విత్తనాలు 650 కిలోలు రైతులకు అందజేశామని గుర్తుజేశారు. అనంతరం ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ మండలంలో 42 పాఠశాలలు ఉండగా మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా 35 శాతం పాఠశాలలు ఎంపిక అయ్యాయని తెలిపారు. మిషన్భగీరథ కార్యక్రమంపై చర్చించగా నారేగూడ, పూల్లపల్లి, ముభారక్పూర్, మాధారం గ్రామాల్లో అక్కడక్కడా పెండింగ్ పనులు ఉన్నాయని వాటిని కూడా త్వరలో పూర్తి చేస్తామని సంబంధిత అధికారి రవి సమాధానం ఇచ్చారు. సమావేశంలో ముభారక్పూర్ సర్పంచ్ చిట్టెపు బాలమణి మాట్లాడుతూ గుబ్బడిఫతేపూర్ గ్రామానికి మూసివాగుపై వెళ్లే బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా పూర్తి చేయడానికి అధికారులతో మా ట్లాడుతా అని హామీ ఇచ్చారు. సమావేశంలో వైస్ ఎంపీపీ కౌకుంట్ల బందయ్యగౌడ్, జడ్పీటీసీ కాలె జయమ్మ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్ గౌడ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రావుగారి వెంకట్రెడ్డి, పులిమామిడి ఎం పీటీసీ సోమ్మనోళ్ల తేజస్వీని, తిమ్మారెడ్డి పల్లి ఎంపీటీసీ కందడా పద్మ , సర్పంచ్లు పాల్గొన్నారు.