ఇబ్రహీంపట్నంరూరల్, ఆగస్టు 15 : మండల పరిధిలోని ఉప్పరిగూడ గ్రామంలో దాతలు, ఉప్పరిగూడ గ్రామ పెద్దలు, యువజన సంఘాలు, ఉప్పరిగూడ భక్త సమాజం సహకారంతో పోచమ్మ తల్లి మందిరాల నిర్మాణం కోసం ఆదివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం 6 గంటలకు గ్రామ పెద్దల సమక్షంలో అమ్మవారి ఆలయ నిర్మాణానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ బూడిద రాంరెడ్డి, బీజేపీ నాయకులు పోరెడ్డి నర్సింహారెడ్డి, లారీ అసోసియేషన్ అధ్యక్షుడు బూడిద నందారెడ్డి, ఉపసర్పంచ్ నర్సింహారెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీశైలం, మాజీ ఉపసర్పంచ్ యాదగిరిరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామంలోని యాదవులకు ఇచ్చిన మాట ప్రకారం మల్లన్న ఆలయ నిర్మాణం కోసం భూమిని కొనుగోలు చేసి సర్పంచ్ రాంరెడ్డి అందజేశారు.