రంగారెడ్డి, మే 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సర్కార్ పార్టీలకతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, దళితబంధు తదితర పథకాలతో అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుతున్నది. కానీ, కాంగ్రెస్ నాయకులు పబ్బం గడుపుకోవడానికి ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఒకవైపు సంక్షేమ ఫలాలు పొందుతూనే.. మరోవైపు విమర్శలు చేస్తూ ఆ పార్టీ అధినేతల దృష్టిలో పడడానికి తహతహలాడుతున్నారు. కాంగ్రెస్ హయాంలో కూడా ఇన్ని పథకాలు లేవని దగ్గరివాళ్లతో చెప్పుకొంటున్నా.. బహిరంగంగా మాత్రం అడ్డగోలు వాదనతో పసలేని ఆరోపణలు చేస్తూ అభాసుపాలవుతున్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి వరుసగా రెండు పర్యాయాలు అధికారం చేపట్టిన సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలను అమ లు చేస్తూ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది.కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటలపాటు విద్యుత్ సరఫరా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, దళితబంధు తదితర పథకాల తో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుతున్నది. ప్రభుత్వం నుంచి లబ్ధి పొంద ని ఇల్లు అంటూ లేదు.
కాగా ప్రభుత్వ పథకాలను లబ్ధి పొందుతూనే కాంగ్రెస్ పార్టీ నాయకు లు, కార్యకర్తలు సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో కేవలం సంబంధిత పార్టీ మద్దతుదారులు మాత్రమే అధిక మొత్తంలో లబ్ధి పొందగా.. సీఎం కేసీఆర్ హయాంలో కాంగ్రెస్తోపాటు ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులంతా లబ్ధి పొందుతున్నారు. ఒక్కొక్క కుటుంబం రెండు, మూడు సంక్షేమ పథకాలను పొందుతుండటం గమనార్హం. రైతుబంధు, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు వంటి పథకాలు లక్షలాది కుటుంబాలకు వరంలా మారాయి. గతంలో వేసవి వచ్చిందంటే తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు.
నీటికోసం కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్లి వ్యవసాయ బావుల నుంచి నీటిని తెచ్చుకునే వారు. కానీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మిషన్ భగీరథ కార్యక్రమంతో రాష్ట్రంలోని ప్రజల తాగునీటి కష్టాలను తీర్చింది. జిల్లా అంతటా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు నల్లాల ద్వారా అందుతున్నది. అదేవిధంగా మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వవైభవం వచ్చింది. మరోవైపు దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు అందే అరకొర పింఛన్లను టీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా పెం చింది. ఆడబిడ్డల వివాహాలకు అండగా ఉంటున్నది. అందుకోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను తీసుకొచ్చింది.
రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యమి స్తూ రైతుబంధు, రైతుబీమా అందిస్తున్నది. అదేవిధంగా దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు దళితబంధు పథకాన్ని తీసుకొచ్చి వారిని ఆదుకుంటున్నది. సంక్షేమ పథకాలను పొందుతూనే సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నా యి. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ అమల్లో లేవని.. ఆ విషయాన్ని ఆ పార్టీ నాయకులు గమనించి మాట్లాడాలని పలువురు రైతులు, నాయకులు పేర్కొంటున్నారు. రాహుల్గాంధీ పర్య టన నేపథ్యంలో పసలేని విమర్శలతో కాంగ్రెస్ శ్రేణులు అభాసుపాలవుతున్నారు.
పైసా ఖర్చు లేకుండానే లబ్ధి
పరిగి, మే 5: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఆ పథకాలతో లబ్ధి పొందుతున్న వారు సంతోషంగా జీవిస్తున్నారు. పైసా ఖర్చు లేకుండా నేరుగా లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అం దుతుండటంపై ప్రభుత్వ పనితీరును అందరూ మెచ్చుకుంటున్నారు. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో సంక్షేమ పథకాల అమలు, సీఎం కేసీఆర్ హయాంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను నిశితంగా గమనించిన వారు ఒక్క రూ పాయి ఖర్చు లేకుండానే పథకాలు అందుతున్నాయని, ప్ర భుత్వం నుంచి లబ్ధి పొందని ఇల్లు అంటూ లేదని పేర్కొంటున్నారు. కాగా ప్రభుత్వ పథకాలను లబ్ధి పొందుతూనే కాం గ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సీఎం కేసీఆర్ ప్రభుత్వం పై లేనిపోని ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు.
రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా పథకాలు ఏకంగా ఐక్యరాజ్యసమితి నుంచి ప్రశంసలు పొందాయి. రైతులు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి ఏడాది ఎకరాకు రెండు సీజన్లకు కలిపి రూ.10వేలు ఇస్తున్నది. అదేవిధంగా రైతుబీమా కింద రైతులకు రూ.ఐదు లక్షలను సర్కారు అందజేస్తున్నది. రైతుల సౌకర్యార్థం రైతువేదికల నిర్మాణంతోపాటు 24 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ను సరఫరా చేస్తున్నది. మరోవైపు వికారాబాద్ జిల్లాలో 1179 చెరువులను మిషన్ కాకతీయ ద్వారా ప్రభుత్వం పునరుద్ధరించింది. తద్వారా వాటిలో నీటి నిలువ సామర్థ్యం పెరిగింది. జిల్లా పరిధిలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఇప్పటివరకు 29వేల మందికి లబ్ధి జరిగింది. పేదింటి యువతుల వివాహానికి ప్రభుత్వం రూ.లక్షా116 అందజేస్తున్నది. సర్కారు దవాఖానల్లో ప్రసవాలను పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్లతో పేదలకు మేలు చేకూరుతున్నది. ఆసరా, దివ్యాంగుల పింఛన్లను పెంచింది. జిల్లా పరిధిలో అన్ని రకాల పింఛన్లు 93,580 మందికి అందుతున్నాయి.
లబ్ధి పొందుతూనే లబోదిబో..
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. సంక్షేమ పథకాలను పొందుతున్న వారిలో కాంగ్రెస్ పార్టీ నాయకులతోపాటు అన్ని పార్టీల నాయకులు ఉన్నారు. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతూనే కాంగ్రెస్ నాయకులు లబోదిబోమంటూ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో అమలవుతు న్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ అమల్లో లేవని.. ఆ విషయాన్ని ఆ పార్టీ నాయకులు గమనించి మాట్లాడాలని పలువురు సూచిస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేయొద్దని హెచ్చరిస్తున్నారు.