కొడంగల్, మే 5: సమ్మర్ క్యాంపుతో విద్యార్థుల్లో సామర్థ్యం పెరుగుతుంది. ఇవి విద్యార్థుల మనోవికాసాన్ని పెంచడమే కాకుండా, ఉన్నత చదువుపై వారికి ఆసక్తిని కలిగిస్తూ వారి లక్ష్యానికి అనుగుణంగా మార్గాలను ఎంచుకునేలా ప్రత్యేక అవగాహన కలిగిస్తాయి. చిన్నారులు వేసవి సెలవుల్లో ఇంటి వద్దే ఉండకుండా వారికి శిక్షణ ఇప్పిస్తే ఉన్నత చదువుల్లో రాణించేందుకు ఆస్కా రం ఉంటుందని తల్లిదండ్రులు భావించి సమ్మర్ క్యాంపుల్లో చేర్పిస్తున్నారు. కాగా ప్రైవేట్కు దీటు గా ప్రభుత్వం గురుకుల పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేకంగా సమ్మర్ క్యాంపులను నిర్వహిస్తున్న ది. విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి వారికి ఏ శిక్షణ అందిస్తే ఉన్నతస్థాయిలో రాణిస్తారో గుర్తించి అందుకు అనుగుణంగా వారికి శిక్షణను ఇప్పించి నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దుతున్నది.
వికారాబాద్ జిల్లాలోని కొడంగల్, పరిగి, యాలాల, దౌల్తాబాద్, వికారాబాద్, నవాబుపేట, కేశంపేట మండలాల్లో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల పాఠశాలల విద్యార్థులకు ఈ వేసవిలో మొయినాబాద్ మండల కేంద్రంలోని ఎంజేపీటీ బీసీడబ్ల్యూఆర్ జూనియర్ కళాశాల భవనంలో ప్రభుత్వం సమ్మర్ క్యాంపును నిర్వహిస్తున్నది. ఇందులో ఆయా పాఠశాలలకు చెం దిన తొమ్మిదో తరగతి పూర్తి చేసి టెన్త్లో చేరుతున్న రెండువందలకు పైగా విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారు. ఈ క్యాంపులో ఐదువందల మందికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయగా ప్రస్తుతానికి 200 మంది విద్యార్థులు చేరినట్లు ఉపాధ్యాయులు తెలిపారు.
చదువుతోపాటు మనోవికాసం..
విద్యార్థులకు సమ్మర్ క్యాంపు నిర్వహించడం ద్వారా వారిలో చదువుతోపాటు మనో వికాసం పెరుగుతుంది. శిక్షణ కాలంలో ఆయా ప్రాంతాలకు చెందిన విద్యార్థులతో కలిసిమెలిసి ఉండ టం ద్వారా వారి అభిరుచులు, అలవాట్లపై అవగాహన పెంచుకోవడంతోపాటు విద్యార్థుల మ ధ్య స్నేహభావం, క్రమశిక్షణ అలవడుతుంది. కొవిడ్ వైరస్ నేపథ్యంలో గత రెండేండ్లుగా విద్యార్థులు చదువులో వెనుకబడిపోయారు. ఆన్లైన్ చదువులతో సబ్జెక్ట్ నాలెడ్జ్ను మరిచిపోయారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపుతో విద్యార్థులు కోల్పోయిన పరిజ్ఞానాన్ని నేర్చుకునే ఆస్కా రం ఉంటుంది. కొవిడ్కు ముందు కొనసాగిన సమ్మర్ క్యాంపులు విద్యార్థులు ఎంచుకున్న పాఠ్యాంశంపై, పాఠ్యాంశాలవారీగా ఒక చోట శిక్షణ ఇచ్చేవారు. విద్యార్థులు కొద్ది మందే ఉండటంతో చదువుకున్నట్లుగా సాగేవి. కాగా ప్రస్తుతంరెండు వందల మంది విద్యార్థులను ఒక చోట చేర్చి వారి ఇష్టాలను గుర్తించి అన్ని అంశాలపై శిక్షణ ఇస్తున్నారు.
విద్యార్థుల్లో సంతోషం..
మే 1 నుంచి 20వ తేదీ వరకు 20 రోజులపాటు ఎంజేపీటీ బీసీడబ్ల్యూఆర్ జూనియర్ కళాశాల భవనంలో జరుగుతున్న సమ్మర్ క్యాంపు విద్యార్థుల్లో సంతోషాన్ని నింపుతున్నది. విద్యార్థులు కలిసిమెలిసి చదువుకోవడంతోపాటు విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు అనేక విషయాలను తెలుసుకొంటున్నారు. తొమ్మిదోతరగతి పాసై టెన్త్లో చేరుతున్న విద్యార్థులకు తొమ్మిది తరగతి బేసిక్స్తోపాటు టెన్త్లోని పాఠ్యంశాలపై అవగాహన కల్పిస్తూ.. స్పోర్ట్స్, ఇతర పోటీలను నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ఉద యం సమయంలో ప్రత్యేక తరగతుల్లో అవసరమైయ్యే బేసిక్స్తోపాటు పదోతరగతిలో ఏఏ పాఠ్యంశాలు ఉంటాయి, ఏ విధంగా చదివితే ఉత్తమ ర్యాంకులను సాధించొచ్చు.. పరీక్షలకు ఏవిధంగా సిద్ధం కావాలనే ముందస్తు అవగాహన కల్పిస్తున్నారు. కొవిడ్ నేపథ్యంలో చదువు లో వెనుబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేకంగా శిక్షణ అందిస్తున్నారు. విద్యార్థులు ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు అనుసరించాల్సిన అంశాలపైనా అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులకు చదువుతోపాటు వాలీబాల్, క్యార మ్స్, ఖోఖో, కబడ్డ్డీ, టెన్నికాయిట్, పరుగు, కల్చరల్ కార్యక్రమాలే కాకుండా విజ్ఞానాన్ని పెంచే చిత్రలేఖనం, క్విజ్, పాటల పోటీల్లోనూ శిక్షణ అందిస్తున్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టిని ఉపాధ్యాయులు సారిస్తున్నారు. ప్రతిరోజూ మెనూ ప్రకారం రుచికరమైన పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నారు.
ఆహ్లాదకర వాతావరణంలో..
ప్రస్తుతం జరుగుతున్న సమ్మర్ క్యాంపు ఆహ్లాదకర వాతావరణంలో జరుగుతున్నట్లు, తాము సంతోషంగా ఉన్నామని విద్యార్థులు పేర్కొంటున్నారు. భవనం చుట్టూ ఆహ్లాదకర, పచ్చటి వాతావరణం ఉందని, పూర్తి భద్రతతో, అన్ని మౌలిక వసతులు అందుతున్నట్లు వారు ఆనం దం వ్యక్తం చేస్తున్నారు.
చదువుపై ఆసక్తి పెరిగింది
సమ్మర్ క్యాంపుతో చదువాలనే ఆసక్తి పెరిగింది. ఇందు లో చదువుతోపాటు విజ్ఞానా న్ని పెంచే ఆటల పోటీలను కూడా నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులతో కలిసి వివిధ అంశాలను తెలుసుకుంటున్నా. -కృష్ణ, టెన్త్ విద్యార్థి వికారాబాద్
విద్యార్థుల అభిరుచులను గుర్తించి..
విద్యార్థుల అభిరుచులను గుర్తించి వారికి శిక్షణ ఇస్తు న్నాం. ఆయా ప్రాంతాల విద్యార్థులతో కలిసి చదువుకోవడం వల్ల విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెం చేందుకు సహకరిస్తున్నా.
– దశరథ్, టీచర్, పీజీటీ బయో సైన్స్