షాద్నగర్/ కొత్తూరు రూరల్, మే 2 : రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన కొనసాగుతున్నదని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. సోమవారం ఇన్ముల్నర్వ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో కొత్తూరు, చౌదరిగూడ, కొందుర్గు, షాద్నగర్ పట్టణాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎంపీ, ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని వివరించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదిగిందన్నారు.
నూతనంగా పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని సూచించారు. కష్టపడ్డ కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుందన్నారు. పార్టీల చేరిన వారిలో ఇన్ముల్నర్వ సర్పంచ్ అజయ్కుమార్, మాజీ సర్పంచ్ మిట్టునాయక్, కొందుర్గు పీఏసీఎస్ డైరెక్టర్ శ్రీనివాస్, షాద్నగర్ పట్టణానికి చెందిన అశోక్యాదవ్లతో ఇతర నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, ఎంపీపీ మధుసూదన్రెడ్డి, జడ్పీటీసీ శ్రీలత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, నాయకులు దేవేందర్, శ్రీనివాసులు, కృష్ణ పాల్గొన్నారు.