కొత్తూరు, జూలై 3 : పట్టణ ప్రగతితో కొత్తూరు రూపురేఖలు మారుస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్యదేవేందర్ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని 8,9,10,11 వార్డుల్లో కౌన్సిలర్లు, అధికారులతో కలిసి చైర్పర్సన్ శనివారం పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజీ, రోడ్డు, నీరు, విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. 3200 మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. పట్టణంలో నర్సరీ కోసం స్థలాన్ని సేకరించామని స్పష్టం చేశారు. ఆమె వెంట వైస్ చైర్మన్ డోలి రవీందర్, కౌన్సిలర్ కొస్గి శ్రీను, మున్సిపల్ కమిషనర్ వీరేందర్, సోమ్లానాయక్, ప్రసన్నలత, టీఆర్ఎస్ నాయకులు కడెంపల్లి సదానందగౌడ్, మాజీ సర్పంచ్ సుదర్శన్గౌడ్, కమ్మరి జనార్దన్, లక్ష్మయ్యయాదవ్, గోవిందరెడ్డి, దాసరి నర్సింహులు, హత్మంత్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, సిటీకేబుల్ వెంకటేశ్, అధికారులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీలో జోరుగా..
తుర్కయాంజాల్, జూలై 03 : తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డుల్లో మూడవ రోజు పట్టణ ప్రగతి కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగాయి. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి వార్డు పరిధిలోని కాలనీల్లో పర్యటించి, పట్ణణ ప్రగతిపై ర్యాలీలు నిర్వహించి ప్రజాసమస్యలను తెలుసుకున్నారు. మునగనూర్ 15వ వార్డులో అంగన్వాడీలో నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి కౌన్సిలర్ వేముల స్వాతిఅమరేందర్రెడ్డి హాజరై మొక్కలు నాటారు. దోమల నివారణకు అయిల్ బాల్స్ను డ్రైనేజీలో వేసి బ్లీచింగ్ పౌడర్ చల్లారు. 9వ వార్డులో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి కౌన్సిలర్ రేవెల్లి హరితయాదగిరి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో వార్డు పరిధిలోని పలు సమస్యలపై ఆమె చర్చించారు. 22వ వార్డులో కౌన్సిల ఫ్లోర్ లీడర్ కొశిక ఐలయ్య పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. పట్టణ ప్రగతిలో భాగంగా కమిషనర్ షఫీఉల్లా పలు వార్డుల్లో పర్యటించి కార్యక్రమాలపై సమీక్షించారు.
శంకర్పల్లి మండలంలో..
శంకర్పల్లి, జూలై 3 : శంకర్పల్లి మండలంలోని గాజులగూడ, లక్ష్మారెడ్డిగూడ, అలంఖాన్గూడ గ్రామాల్లో శనివారం మండల పల్లె ప్రగతి పరిశీలకులు, డీఆర్డీవో అధికారి ప్రభాకర్ ముమ్మరంగా తిరిగి పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ చేకుర్త గోవిందమ్మ, ఎంపీడీవో సత్తయ్య, ఈవోఆర్డీ గీత, మహాలింగాపురం ఎంపీటీసీ యాదగిరి పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నాయకులు చేకుర్త గోపాల్రెడ్డి, నరేందర్రెడ్డి, గ్రామ కార్యదర్శులు పాల్గొనగా, ఎల్వెర్తి సర్పంచ్ సత్యనారాయణ పల్లె ప్రకృతి వనంలో వాకింగ్ ట్రాక్ కోసం మట్టిని తరలించారు.
శంకర్పల్లి మున్సిపల్లో..
శంకర్పల్లి, జూలై 3 : శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 5వేల మొక్కలు మూడు పార్కుల్లో నాటినట్లు మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి తెలిపారు. చెత్తాచెదారాన్ని తొలగిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బి.వెంకట్రాంరెడ్డి, శంకర్పల్లి పీఏసీఎస్ చైర్మన్ బి.శశిధర్రెడ్డి, కమిషనర్ యాదగిరి, కౌన్సిలర్లు సంధ్యారాణిఅశోక్కుమార్, చంద్రమౌళి, శ్రీనాథ్గౌడ్, పార్శిరాధ, బి.లావణ్య, వై.వాణిం అశోక్, జె.శ్వేత, సంతోష్, గోపాల్, నూర్జహాబేగం, రాములు, కోఆప్షన్ సభ్యులు షబానాబేగం, వెంకట్రెడ్డి, గొల్లాగు మహమూద్, మాజీ ఉప సర్పంచ్ సాత ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు.
పల్లె ప్రగతి పనుల పరిశీలన
కొందుర్గు, జూలై 3 : జిల్లేడు చౌదరిగూడ మండలంలోని ఆయా గ్రామాల్లో చేపడుతున్న పల్లె ప్రగతి పనులను ప్రత్యేక అధికారి రఘుపతిరెడ్డ్డి పరిశీలించారు. ఎదిర గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని ఎంపీవో విజయ్కుమార్పాల్తో కలిసి పరిశీలించారు. కొందుర్గు మండలంలోని ఆయా గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు కొనసాగుతున్నట్లు అధికారులు వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ బాల్రాజ్, కార్యదర్శి జ్యోత్స్న పాల్గొన్నారు.
కేశంపేటలో..
కేశంపేట, జూలై 3 : మండలంలోని గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రధానరోడ్లు, వీధుల్లో మొక్కలను నాటారు. ఈ సంవత్సరం ప్రభుత్వ లక్ష్యం ప్రకారం గ్రామాల్లో మొక్కలను నాటేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు హరితహారాన్ని చేపడుతున్నారు.
మూడోరోజు ముమ్మరంగా..
ఇబ్రహీంపట్నం, జూలై 3 : నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, పెద్దఅంబర్పేట్, తుర్కయంజాల్, ఆదిబట్ల మున్సిపాలిటీలతో పాటు ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట్, యాచారం, మంచాల మండలాల్లో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు, వైస్చైర్మన్లు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అబ్దుల్లాపూర్మెట్ మండలంలో..
అబ్దుల్లాపూర్మెట్, జూలై 3 : మండలంలోని కవాడిపల్లి, బలిజగూడ, లష్కర్గూడ గ్రామాల్లో జడ్పీటీసీ బింగి దాస్గౌడ్, వైస్ఎంపీపీ కొలన్ శ్రీధర్రెడ్డితో కలిసి ఎంపీపీ బుర్ర రేఖమహేందర్గౌడ్ పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. వారి వెంట మండల కోఆప్షన్సభ్యుడు ఎండీ గౌస్పాషా, సర్పంచ్లు దూసరి సుజాతయాదయ్యగౌడ్, బుర్ర వీరస్వామిగౌడ్, ఏసూరి పారిజాతశేఖర్, ఉపసర్పంచ్లు, వార్డుసభ్యులు, గ్రామస్తులు ఉన్నారు.
కొత్తూరులో ప్రగతి జోరు
కొత్తూరు రూరల్, జూలై 3 : మండల పరిధిలోని మల్లాపూర్, మల్లాపూర్తండా, గూడూరు, మక్తగూడ, తీగాపూర్, ఇన్ముల్నర్వ, పెంజర్ల, కొడిచర్ల, కొడిచర్లతండా, ఎస్బీపల్లి, సిద్దాపూర్, వైఎంతండా గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఇన్ముల్నర్వలో సర్పంచ్ అజయ్నాయక్ ఆధ్వర్యంలో పాత ఇండ్లను కూల్చివేశారు. ఎస్బీపల్లి గ్రామంలో సర్పంచ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఇండ్లమధ్య ఖాళీ స్థలాల్లో కలుపు మొక్కలను తొలిగించారు.
మంచాలలో మొక్కల పంపిణీ
మంచాల, జూలై 3 : మండలంలోని పలు గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ మొక్కల పంపిణీతో పాటు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆరుట్ల గ్రామంలో సర్పంచ్ విష్ణువర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ చేశారు.