ఇబ్రహీంపట్నం రూరల్, డిసెంబర్ 13: సీఎం కేసీఆర్ శాసనసభలో చెప్పిన విధంగా లక్ష ఉద్యోగాల భర్తీకి వడివడిగా అడుగులు పడుతున్నాయి. వరుసగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అవుతుండటంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి ఉద్యమ సారథి సీఎం కేసీఆర్ చెప్పినట్లుగానే నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు జారీ కాగా.. తాజాగా గ్రూప్-4 నోటిషికేషన్ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. దీనిద్వారా 9,168 పోస్టులు భర్తీ కానున్నా యి. త్వరలోనే ఉపాధ్యాయ పోస్టులకూ నోటిఫికేషన్ రానున్నది. దీంతో ఉద్యోగార్థులు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
కిటకిటలాడుతున్న గ్రంథాలయాలు
రంగారెడ్డి జిల్లాలోని 32 గ్రంథాలయాలు నిరుద్యోగులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే వారు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఇప్పటికే ఉచిత కోచింగ్ సెంటర్ల ద్వారా పోలీస్, ఇతర పోటీ పరీక్షలకు ప్రభుత్వం శిక్షణ ఇప్పించింది. ఇబ్రహీంపట్నం ఎమ్మె ల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఎంకేఆర్ ఫౌండేషన్ ద్వారా పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. అలాగే, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు సం బంధించిన శిక్షణను కూడా ఉచితంగా ఇప్పించేందు కు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిళ్లు, గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను అధికారులు అందుబాటులో ఉం చారు. వాటిని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకుంటున్నది. వరుసగా ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తుండటంతో ప్రిపరేషన్లో మునిగిపోయారు. జిల్లాలో గ్రంథాలయాలతోపాటు బీసీ స్టడీ సర్కిళ్లున్నా యి. ఒక జిల్లా గ్రంథాలయం బడంగ్పేటలో ఉండగా, 24 శాఖ గ్రంథాలయాలు, 7 గ్రామీణ గ్రంథాలయాలున్నాయి. వీటిలో సుమారుగా 3.60 లక్షల పుస్తకాలు అన్ని భాషల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ పుస్తకాల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ప్రతీది అందుబాటులో ఉన్నాయి.
కొలువుల జాతర..
ప్రభుత్వం ఇప్పటికే పలు నోటిఫికేషన్లను జారీ చేయ గా.. తాజాగా గ్రూప్-4 నోటిఫికేషన్ కూడా రావడంతో ఉద్యోగార్థులు అందుబాటులో ఉన్న గ్రంథాలయాలు, ఇతర కోచింగ్ సెంటర్లకు వెళ్తున్నారు. మరి కొంతమంది అవసరమైన పుస్తకాలను తెచ్చుకుని ఇండ్లలో చదువుతున్నారు. కాగా, స్థానిక అభ్యర్థులు తమ సొంత జిల్లా, జోన్, మల్టీజోన్లలో 95 శాతం రిజర్వేషన్ సౌకర్యాన్ని కలిగి ఉండటమే కాకుండా ఇతర జిల్లాలు, జోన్లు, మల్టీజోన్లలో ఐదు శాతం ఓపె న్ కోటాలో ఉద్యోగాలకు పోటీపడే అవకాశం ఉన్నది. కొత్త జోనల్ విధానంతో పాత వ్యవస్థ పూర్తిగా రైద్దెం ది. ఇప్పటివరకు ఉన్న జోనల్ వ్యవస్థ ద్వారా జిల్లాలో అటెండర్ నుంచి రాష్ట్రస్థాయి కేడర్ వరకు స్థానికేతరులు భారీగా ప్రభుత్వ పోస్టులను పొందేవారు. కొత్త విధానం ద్వారా ఈ వ్యవస్థ పూర్తిగా మారిపోయి స్థానికులకే ప్రయోజనం కలుగనున్నది.
జిల్లా, జోనల్, బహుళ జోన్ పరిధిలో జరిగే ప్రత్యక్ష నియామకాల్లో 95 శాతం పోస్టులు స్థానికులకే దక్కుతాయి. ఈ లెక్కన గతంలో జరిగిన భర్తీ విధానంతో పోల్చితే జిల్లాస్థాయి పోస్టుల్లో అదనంగా పదిహేను శాతం పో స్టులు స్థానికులకు దక్కుతాయి. అలాగే, జోనల్ కేడర్లో 25 శాతం, బహుళ జోన్ పరిధిలో 35 శాతం పోస్టులు స్థానికులకు దక్కనున్నాయి. జిల్లా, జోనల్, బహుళ జోన్ పరిధిలో కేవలం 5 శాతం మాత్రమే స్థానికేతర రిజర్వేషన్లుంటాయి. ఇందులోనూ మన స్థానికులు పోటీపడొచ్చు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం నోటిఫికేషన్లు వరుసగా జారీ చేస్తున్నారు. ఉద్యోగాల వారీగా విద్యార్హతలు, వయోపరిమితి, సిలబస్ తదితర వివరాలను వెబ్సైట్లో
అధికారులు పొందుపరుస్తున్నారు.