కడ్తాల్, డిసెంబర్ 13 : అభివృద్ధిలో కడ్తాల్ మండలాన్ని జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు జడ్పీటీసీ దశరథ్నాయక్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని పలు గ్రామాలు, తండాల్లో ప్రజాప్రతినిధులతో కలిసి జడ్పీటీసీ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. రావిచేడ్ గ్రామం నుంచి మద్దెలకుంట వరకు చేపట్టిన బీటీ రోడ్డుతోపాటు మద్దెలకుంట తండాలో అంగన్వాడీ కేంద్రం నిర్మాణ పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాలు, తండాల అభివృద్ధికి రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. నూతన మండలం కడ్తాల్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. రావిచేడ్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ రూ.25 లక్షలు మంజూరు చేశారన్నారు. అనంతరం పల్లెచెల్క తండాలో ఇటీవల మరణించిన వివిధ కుటుంబాలను పరామర్శించి ఐదు వేల చొప్పున రూ.30 వేలు ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు శ్రీనివాస్రెడ్డి, మండలాధ్యక్షుడు వీరయ్య, సర్పంచ్లు సులోచన, తులసీరాంనాయక్, లోకేశ్నాయక్, భారతమ్మ, యాదయ్య, ఎంపీటీసీలు గోపాల్, లచ్చిరాంనాయక్, మంజుల, ప్రియ, ఏఎంసీ డైరెక్టర్లు లాయక్అలీ, నర్సింహాగౌడ్, ఉప సర్పంచ్లు వెంకటేశ్, గణేశ్, సీతారాం పాల్గొన్నారు.