కులకచర్ల, డిసెంబర్ 11 : కులకచర్ల మండలం రాంపూర్ గ్రామానికి చెందిన శరీఫ్(26) శామీర్పేట్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి రాజీవ్హ్రదారి తుర్కపల్లి-అచ్చాయిపల్లి చౌరస్తావద్ద పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తుండగా గుర్తు తెలియనివాహనం ఢీకొని తీవ్రగాయాలైన శరీఫ్ యశోద దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందగా ఆదివారం మృతదేహాన్ని కులకచర్ల మండలం రాంపూర్ గ్రామానికి తీసుకువచ్చారు. శరీఫ్కు పదినెలల క్రితం వివాహం జరిగింది. 20 రోజుల కిందట కూతురు జన్మించింది. రాత్రి విధులు ముగించుకొని కూతురు తొట్టెలకు రావాల్సి ఉండగా, విధులు నిర్వహిస్తున్న సమయంలోనే మృత్యువు కబలించిందని కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు. కాగా మృతదేహాన్ని బాల్నగర్ జోన్ డీసీపీ గోనె సందీప్, ఏసీపీ రామలింగరాజు, ఎస్ఐలు రవి, చంద్రశేఖర్, అనిత, ఆర్ఎస్ఐ అనిల్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు.