షాద్నగర్టౌన్, డిసెంబర్ 10: క్రీడలు మానసిక ఉల్లాసాన్నిస్తాయని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. పట్టణంలోని మినీ స్టేడియంలో శనివారం నిర్వహించిన షాద్నగర్ ప్రీమియం లీగ్-1 క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. క్రీడలతో స్నేహపూరిత వాతావరణం ఏర్పడుతుందన్నారు. యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు క్రీడలు ఎంతో దోహదపడుతాయన్నారు. యువత చదువుతో పాటు క్రీడా రంగంలో రా ణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. అదే విధంగా క్రీడాకారుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృ షి చేస్తున్నదన్నారు. అనంతరం క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, నాయకులు చెట్ల నర్సింలు, ఏజాజ్ పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
నియోజకవర్గంలోని వివిధ మండలాలలోని గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ పంపిణీ చేశారు. ఫరూఖ్నగర్ మండలం కందివనం గ్రామానికి చెందిన నర్సింహులుకు రూ. 60వేలు, కొత్తూరు మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన సునీతకు రూ.60వేలు, సుదీప్రెడ్డికి రూ. 30వేలు, ఆంజనేయులుచారికి రూ. 40 వేలు, నిర్మలమ్మకు రూ. 60 వేలు, జిల్లేడు చౌదరిగూడ మండలం జాకారం గ్రామానికి చెందిన రోహన్కు రూ. 60 వేలు, చలివేంద్రంపల్లికి చెందిన శ్రీనివాసులుకు రూ. 57 వేల సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం సహాయనిధి ద్వారా పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుతుందన్నారు. సీఎం సహాయనిధి పేద ప్రజలకు వరంలా మారిందన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లక్ష్మణ్నాయక్, నాయకులు పాల్గొన్నారు.
కేశంపేట : మండలంలోని నిర్దవెళ్లికి చెందిన బూత్కూర్ ప్రతాప్రెడ్డికి లక్ష రూపాయల ఎల్ఓసీ మంజూరైంది. ఎల్వోసీని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కుటుంబ సభ్యులకు అందజేశారు. అదేవిధంగా ఎక్లాస్ఖాన్పేట గ్రామానికి చెందిన ఎ.క్రాంతికుమార్కు రూ. 32 వేలు, కె.లక్ష్మీబాయిలకు ఎంపీపీ రవీందర్యాదవ్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మండల కోఆప్షన్ మెంబర్ జమాల్ఖాన్, బీఆర్ఎస్ నాయకులు వెంకటయ్య, వెంకటేశ్, కృష్ణయ్య, నాగరాజ్, నిరంజన్ పాల్గొన్నారు.