యాచారం, డిసెంబర్ 5: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాల్య వివాహాల నిర్మూలనపై సోమవారం బాలికలకు అవగాహ న కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటనారాయణ మాట్లాడు తూ.. బాలికలు తమ హక్కులను, చట్టాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. బాల్యవివాహాలు చేసుకోవద్దన్నారు. తల్లిదండ్రుల మాట విని క్రమశిక్షణతో మెలగాలన్నారు. పాఠశాల స్థాయి నుంచే కష్ట పడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎవరైనా వేధిస్తే షీ టీమ్స్ను సంప్రదించాలన్నారు. అవసరమైతే 100 కాల్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.