బొంరాస్పేట, నవంబర్ 30 : రైతు సంక్షేమమే కేసీఆర్ ప్రభుత్వ ధ్యేయమని పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని తుంకిమెట్ల, దుప్చెర్ల గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ హేమీబాయితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు వానకాలం, యాసంగిలో పండించిన ధాన్యంతో పాటు కందులు, పెసర్లు, పత్తి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. మార్కెట్లకు వెళితే రైతులు నష్టపోతారన్న ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామాల్లోనే ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం కొనుగోలు చేస్తుందని రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుదర్శన్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కృష్ణ, తాలుకా టీఆర్ఎస్ అధికార ప్రతినిధి టీటీ రాములు, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు కోట్ల యాదగిరి, పార్టీ నాయకులు శ్రీనివాస్రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
ధాన్యాన్ని దళారులకు విక్రయించొద్దు
పరిగి టౌన్, నవంబర్ 30 : రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి విక్రయించుకోవాలని ఎంపీపీ కరణం అరవింద్రావు సూచించారు. బుధవారం మండల పరిధిలోని ఇబ్రహీంపూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. రైతులు ధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ నర్సమ్మ, ఏపీఎం శ్రీనివాస్రెడ్డి, గ్రామసంఘం అధ్యక్షురాలు శ్యామమ్మ పాల్గొన్నారు.