పెద్దఅంబర్పేట, నవంబర్ 30 : వచ్చే ఎన్నికల్లో మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీయే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఆ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు సిద్దెంకి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం పెద్దఅంబర్పేటలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మున్సిపల్ మాజీ అధ్యక్షుడు బలరాంతో కలిసి ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆదేశాల ప్రకారం ఒక్కో వార్డులోని 25 మంది ముఖ్యమైన నాయకులు ఒక్కొక్కరు వంద ఓట్లను సమకూర్చేందుకు కష్టపడి పనిచేయాలని సూచించారు. సమావేశంలో కౌన్సిలర్లు హరిశంకర్ ముదిరాజ్, పరశురాంనాయక్, కోటేశ్వరరావు, నాయకులు దామోదర్, విజేందర్రెడ్డి, విజయభాస్కర్రెడ్డి, జగన్, వెంకటేశ్గౌడ్, శ్రీనివాస్రెడ్డి, రాము, నందుసింగ్, నాగార్జున, ముకేశ్, శివ పాల్గొన్నారు.
రాష్ర్టాభివృద్ధి కేసీఆర్తోనే సాధ్యం
యాచారం : రాష్ర్టాభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతుందని టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పాశ్చా భాషా అన్నారు. మండలంలోని తక్కళ్లపల్లి గ్రామంలో బుధవారం గ్రామ శాఖ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సంతోష, నాయకులు మల్లేశ్, సంపత్, రమేశ్, వెంకటేశ్, నాగరాజు పాల్గొన్నారు.
గ్రామగ్రామాన గులాబీపార్టీని ఎదురులేని శక్తిగా తీర్చిదిద్దాలి
ఇబ్రహీంపట్నంరూరల్ : మండలంలోని గ్రామగ్రామాన టీఆర్ఎస్ పార్టీని ఎదురులేని శక్తిగా మార్చేందుకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సారథ్యంలో కలిసికట్టుగా ముందుకు సాగుదామని ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేశ్ అన్నారు. మండల పరిధిలోని ఉప్పరిగూడ, పోచారం గ్రామాల్లో బుధవారం పార్టీ మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములు ఆధ్వర్యంలో విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, ఉపసర్పంచ్లు నర్సింహారెడ్డి, భగీరథ్, గ్రామశాఖ అధ్యక్షుడు రమేశ్, నాయకులు శ్యామ్, కృష్ణ పాల్గొన్నారు.
టీఆర్ఎస్ను మరింత పటిష్టంగా తయారుచేద్దాం
కొత్తూరు : టీఆర్ఎస్ను మరింత పటిష్టంగా తయారు చేసేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఎంపీపీ మధుసూదన్రెడ్డి అన్నారు. మండలంలోని పెంజర్లలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మెండె కృష్ణయాదవ్ ఆధ్వర్యంలో బుధవారం టీఆర్ఎస్ ముఖ్య కార్తకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం లేదని.. తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ అన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శ్యామ్సుందర్రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు జైపాల్, టీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు దామోదర్రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు సత్తయ్య పాల్గొన్నారు.