చేవెళ్ల రూరల్, నవంబర్ 26 : డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాం గం మనందరికి గొప్ప వరమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. చేవెళ్ల మండలం కందవాడ అనుబంధ గ్రామమైన నారాయణ్దాస్గూడలో శనివారం ఆమె అంబేద్కర్ విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమ సమాజ నిర్మాణంలో రాజ్యాంగం కీలక భూమిక పోషిస్తున్నదన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారన్నారు. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా గురుకులాలను ఏర్పాటు చేసి విద్యా వ్యవస్థను బలోపేతం చేశారన్నారు. పేద విద్యార్థుల కోసం విదేశీ విద్య నిధి పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం దళితుల ఆర్థికాభివృద్ధి కోసం దళితబంధును తెచ్చిందన్నారు. అట్టడుగువర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకెళ్తున్నదన్నారు.
అనాడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ నిర్మాణం చేసిన రాజ్యాంగం మనందరికి గొప్ప వరమని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. చేవెళ్ల మండల పరిధిలోని కందవాడ అనుంబంధ గ్రామం నారాయణ్దాస్గూడలో శనివారం అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై.. ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, దళిత రత్న అవార్డు గ్రహీత ప్రభాకర్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. ఒక వర్గానికే పరిమితం అవ్వకుండా వ్యవస్థలో మార్పు తీసుకువచ్చేలా రాజ్యాంగం అమలవుతున్నదన్నారు. వ్యవస్థలో మార్పు రావాలని మనందరం కోరుకుందామని.. విగ్రహాలను ప్రతిష్ఠించుకొని వారి అడుగుజాడల్లో మనందరం నడువాలని పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి తమ హక్కులను రాజ్యాంగం ద్వారా తెలుసుకొని, ప్రభుత్వం నుంచి రావాల్సిన హక్కులను పొందేలా ముందుకు సాగుతున్నారని తెలిపారు.
అట్టడుగువర్గాల ప్రజలు బాగుపడాలంటే ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకొని వారి అభివృద్ధికి పాటుపడాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన ఉద్దేశమన్నారు.అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అందరికీ విద్యనందిస్తే అభివృద్ధి చెందినట్లే అన్న భావనతో సీఎం కేసీఆర్ అదే దిశగా అడుగులు వేస్తూ దేశంలోనే ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో 100 గురుకులాలను ఏర్పాటుచేసి విద్యా వ్యవస్థను పటిష్టం చేశారని పేర్కొన్నారు. విదేశాల్లో చదువుకోవాలనుకునే పేద విద్యార్థుల కోసం అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఏర్పాటు చేసి రూ.20 లక్షలు ఇస్తున్నారని తెలిపారు. అంబేద్కర్ ఆశయాల సాధన దిశగా సీఎం కేసీఆర్ ఒక అడుగు ముందుకు వేసి దళిత బంధు అనే పథకం ప్రవేశపెట్టి వారి ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్నారన్నారు.
కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ప్రసాద్, సర్పంచ్ అరుధ సాయిరెడ్డి, విగ్రహ దాతలు నారాయణదాస్, మాణెమ్మ, చేవెళ్ల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు ప్రవీణ్, దేవునిఎర్రవల్లి సర్పంచ్ మాణిక్యరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, కందవాడ ఎంపీటీసీ రవీందర్యాదవ్, టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు శేఖర్, సివిల్ సైప్లె జిల్లా సభ్యుడు రవీందర్, కౌకుంట్ల రైతు బంధు సమితి అధ్యక్షుడు నాగార్జునరెడ్డి, టీఆర్ఎస్ మండల బీసీ సెల్ అధ్యక్షుడు రాములు, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు శివారెడ్డి, మల్కాపూర్ ఎంపీటీసీ రవీందర్రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, కళాకారులు, అంబేద్కర్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
అంబేద్కర్ వల్లే నేను మీతో ఉన్నా : ఎమ్మెల్యే కాలె యాదయ్య
అంబేద్కర్ వల్లే నేను ప్రజాక్షేత్రంలోకి రావడానికి అవకాశం లభించిందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం, హక్కులతోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమవుతున్నదని, ప్రతిఒక్కరికి సమాన హక్కులు కల్పించేలా రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారని పేర్కొన్నారు. కందవాడ-షాబాద్ మీదుగా సులువుగా రవాణా సౌకర్యం కల్పించే దిశగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే మంత్రికి వినతిపత్రం అందజేశారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించి బ్రిడ్జి విషయం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.