కొత్తూరు, నవంబర్ 21: రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, అందువల్ల పేదలకు నాణ్యమైన వైద్యం అందుతుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని గూడూరు, ఎస్బీపల్లి గ్రామాల్లో 15 ఆర్థిక సంఘం నిధులు రూ. 20 లక్షలతో ఒక్కో సబ్ సెంటర్ నిర్మాణానికి ఎమ్మెల్యే సోమవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఎమ్మె శ్రీలత, ఎంపీపీ మధుసూదన్రెడ్డి, ఎంపీటీపీ రవీందర్రెడ్డి, సర్పంచ్లు బ్యాగరి సత్తయ్య, అంబటి ప్రభాకర్, రవినాయక్, టీఆర్ఎస్ నాయకులు తస్యనారాయణ, యాదగిరి, లింగం, రమేశ్, పద్మారావు పాల్గొన్నారు.
సమష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యం
నందిగామ : సమష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యమవుతుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఎంపీపీ ప్రియాంక ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమావేశంలో ఆయా శాఖల అధికారులు ఎజెండాను చదివి వినిపించారు. అనంతరం ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షే మ కార్యక్రమాలకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారి సంగీత లక్ష్మికి సూచించారు.
మరికొన్ని రోజుల్లో ప్రారం భం కానున్న రెవెన్యూ సదస్సులను క్షేత్ర స్థాయిలో పరిశీలిం చి పకడ్బందీగా నిర్వహించాలన్నారు. గ్రామాల్లో భూ సమస్యలు లేకుండా చేయాలని, రేషన్ కార్డులలో కొంత మంది లబ్ధిదారుల పేర్లు లేకుండా పోయాయని, వెంటనే అర్హులైన లబ్ధిదారుల పేర్లు కార్డులో యాడ్ చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశానికి సర్పంచ్లు హాజరు కాకపోవడంపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, కొత్తూరు ఎంపీపీ మధుసూదన్రెడ్డి, ఎంపీడీవో బాల్రెడ్డి, సర్పంచ్లు రాజు, నర్సింహులు, ఎల్లమ్మ, ఎంపీటీసీలు కట్న లత, మాధవి, చంద్రపాల్రెడ్డి, కుమారస్వామిగౌడ్, రాజు, కో ఆప్షన్ సభ్యులు బేగ్ ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేయాలి
షాద్నగర్ : షాద్నగర్ గ్రేడ్-1 గ్రంథాలయాన్ని మరింత అభివృద్ధి చేసి పాఠకుల సంఖ్యను పెంచాలని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ నూతన కమిటీ సభ్యులను కోరారు. ప్రస్తుతం కొనసాగుతున్న కమిటీ సభ్యులను కొంతకాలం పాటు పొడిగించిన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసంలో ఆయనను కలిసి సన్మానించారు. గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాల న్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు లక్ష్మీ నర్సింహారెడ్డి, గ్రంథాలయ కమిటీ ఉపాధ్యక్షుడు అరుణ, మహేశ్వర్, పల్లాటీ సురేందర్, ప్రధాన కార్యదర్శి అల్లాడ శేఖర్, సభ్యులు యాదయ్య, సుధాకర్ పాల్గొన్నారు.