బొంరాస్పేట, నవంబర్ 21: ముదిరాజ్లు ఐకమత్యంగా ఉండి సమస్యల సాధన కోసం పోరాడాలని సంఘం నాయకులు బాబయ్యనాయుడు, తిరుపతయ్య, కృష్ణ అన్నారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా సోమవారం మండలంలోని బొంరాస్పేట, తుంకిమెట్ల, నాగిరెడ్డిపల్లి, వడిచెర్ల గ్రామాలలో ముదిరాజ్లు జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ ముదిరాజ్లు రాజకీయంగా, విద్యాపరం గా, సామాజికంగా వెనుకబడి ఉన్నారని సంఘటితంగా ఉండి అన్ని రంగాలలో ముం దుండడానికి ఉద్యమించాలని అన్నారు. ముదిరాజ్లను బీసీ డీ గ్రూపు నుంచి ఏ గ్రూపులో చేర్చాలని ప్రభుత్వానికి నాయకులు కోరారు. కార్యక్రమంలో నాగిరెడ్డిపల్లి సర్పంచ్ హన్మంతు, బొంరాస్పేట ఉప సర్పంచ్ అంజిలయ్య, వడిచెర్ల వెంకటేశ్ పాల్గొన్నారు.
దోమ: మండల పరిధిలోని కిష్టాపూర్ గ్రామంలో మండల ముది రాజ్ సంఘం అధ్యక్షుడు నర్సింహులు ముదిరాజ్తో కలిసి పరిగి నియోజకవర్గ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రామస్వామి ముదిరాజ్ జెండాను ఎగురవేశారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముదిరాజ్ కులస్తులందరూ ఐక్యంగా ఉండి జాతి అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి చందు, కార్యదర్శి సంజీవ్కుమార్ముదిరాజ్, ఉపాధ్యక్షుడు కేశవులు, నియోజకవర్గ ముఖ్య సలహాదారు హన్మంతు ముదిరాజ్, సంఘం నాయకులు వెంకటయ్య, శ్రీను, రవి, శేఖర్, జంగ య్య, నర్సిం హులు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
కులకచర్ల: కులకచర్ల మండల కేంద్రంలోని పెద్ద గేటు చౌరస్తాలో మత్స్యకారుల పారిశ్రామిక సహకార సంఘం ఆవిర్భావదినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు చంద్రలింగం ఆధ్వర్యంలో ముదిరాజ్ సంఘం జెండాను ఎగురవేసి ఆవిర్భావ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ హరికృష్ణ, నాయకులు మహిపాల్, బీఎస్ ఆంజనేయులు, లక్ష్మణ్, శ్రీనివాస్, వివిధ గ్రామాల ముదిరాజ్ సం ఘాల అధ్యక్షులు, ప్రధాన కార్య దర్శులు, సభ్యులు పాల్గొన్నారు. చౌడాపూర్ మండల కేంద్రంలోముదిరాజ్ సంఘం ఆవిర్భావది నోత్స వాన్ని సోమవారం ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాస్ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు.