కులకచర్ల, నవంబర్ 21 : రైతులకు గిట్టుబాటు ధరకల్పించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. సోమ వారం చౌడాపూర్ మండల పరిధిలోని చాకల్పల్లి, మరికల్, చౌడాపూర్, కులకచర్ల మండల కేంద్రంలోని ఏఎంసీ, ఐకేసీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ గ్రామాల్లో రైతులకు అందుబాటులో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నదన్నారు.
రైతులు తమకు కేటాయించి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వ్యవ సాయానికి పూర్తి స్థాయిలో రుణాలను అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కులక చర్ల జడ్పీటీసీ రాందాస్నాయక్, చౌడాపూర్ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సత్తినేని సుధాకర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ హరికృష్ణ, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, మరికల్ సర్పంచ్ పాండురంగయ్య, చౌడాపూర్ గ్రామ సర్పంచ్ కొత్తరంగారెడ్డి, కులకచర్ల సర్పంచ్ సౌమ్యావెంకట్రాంరెడ్డి, చౌడాపూర్ ఎంపీటీసీ శంకర్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రాంలాల్, మందిపల్ వెంకట్, అశోక్, మొగులయ్య, వినోద్, నర్సింహులు, శివకుమార్, లింగంపల్లి నర్సింహ, రాజప్ప, వెంకటయ్యగౌడ్, ఏపీఎం శోభ, మహిళా సంఘాల సభ్యు లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఆర్థిక చేయూత నివ్వాలనే లక్ష్యంతో…
దోమ, నవంబర్21: రైతు పండించిన ప్రతి గింజను కొని వారికి ఆర్థిక చేయూత నివ్వాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని జడ్పీటీసీ నాగిరెడ్డి అన్నారు.సోమవారం మండల పరిధిలోని దోమ, దాదాపూర్ గ్రామాల్లో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటుగా అయినాపూర్,గుండాల్ గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయా గ్రామ సర్పంచ్లతో కలిసి జడ్పీటీసీ నాగిరెడ్డి ప్రారంభించారు. శివారెడ్డిపల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్ నరేందర్రెడ్డి టీఆర్ఎస్ యువ నాయకుడు అర్జున్రెడ్డితో కలిసి డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే వరి కొను గోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి,వైస్ ఎంపీపి మల్లేశం, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు గోపాల్గౌడ్, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ లక్ష్మయ్య ముదిరాజ్, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి, అయినాపూర్ సర్పంచ్ మల్లేశం, దాదాపూర్ సర్పంచ్ కృష్ణ గుండాల సర్పంచ్ సుజాతవెంకట్రెడ్డి, గ్రంథాల సంస్థ డైరెక్టర్ యాదయ్య గౌడ్,మండల మాజీ అధ్యక్షుడు రాఘవేందర్రెడ్డి, యువ నాయకులు కృష్ణారెడ్డి, రాఘవేందర్రెడ్డి, నరేందర్రెడ్డి, నారాయణ,వెంకటయ్య,ఏవో ప్రభాకర్రావు. వార్డు సభ్యులు పాల్గొన్నారు.
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..
యాలాల, నవంబర్21 : రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీపీ బాలేశ్వర గుప్త అన్నారు. సోమవారం యాలాల మండల కేంద్రంతో పాటు విశ్వనాథ్పూర్, జుం టుపల్లి లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ రైతు కూడా ఇబ్బంది పడకూడదనే సదుద్దేశ్యంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను గ్రామ గ్రామాన నెలకొల్పుతుందన్నారు. అనంతరం వివిధ గ్రామాలకు చెందిన 24 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీడీవో పుష్పలీల, అగ్రికల్చర్ ఏవో, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.