అబ్దుల్లాపూర్మెట్, నవంబర్ 21 : పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక సాయం అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని, పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలోని శివగార్డెన్లో తహసీల్దార్ అనితారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయాన్ని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, ఎంపీపీ బుర్ర రేఖ, పెద్దఅంబర్పేట మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, సర్పంచ్లు కిరణ్కుమార్గౌడ్, ఏసూరి పారిజాత, జక్క లావణ్య, సుధాకర్రెడ్డి, వెంకటేశ్, లావణ్య, లతశ్రీ, శ్రీనివాస్రెడ్డి, వీరస్వామిగౌడ్, సుజాత, మున్సిపాలిటీల కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
27 మందికి 8లక్షల చెక్కుల ..
ఇబ్రహీంపట్నం : ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 27 మందికి రూ. 8.7 లక్షలు విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే కిషన్రెడ్డి అందజేశారు. సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, యాచారం మాజీ జడ్పీటీసీ రమేశ్గౌడ్, టీఆర్ఎస్ మంచాల మండల అధ్యక్షుడు చీరాల రమేశ్, ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడు బుగ్గరాములు పాల్గొన్నారు.