తాండూరు, నవంబర్ 20: నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీకి చేయూతనిచ్చి లాభాల బాటలో నడిపించేందుకు సీఎం కేసీఆర్ చేసిన ఆలోచన సత్ఫలితాలను ఇస్తు న్నది. ప్రజా రవాణా వ్యవస్థలో విశేష సేవలు అందిస్తున్న ఆర్టీసీ సరుకు రవాణా లోనూ విజయవంతంగా ముందుకు పోతున్నది. కార్గో పార్సిల్ సర్వీస్ ప్రైవేటు కొరియర్ సర్వీ సులకంటే వేగంగా ప్రజలకు చేరువైంది. జిల్లాలోని తాండూరు, వికారాబాద్, పరిగి డిపో పరిధిలో ప్రస్తుతం 11 కౌంటర్లు కొనసాగుతున్నాయి. రెండున్నరేండ్లలో వీటి ద్వారా రూ. కోటికి పైగా ఆదాయం సమకూరింది. మామిడి పండ్ల నుంచి ప్రమఖ దేవస్థానాల ప్రసా దాల వరకు అన్నింటినీ తక్కువ ధరలో సరఫరా చేస్తూ జనం ఆదరణ పొందు తున్నది. పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రధాన రవాణా సౌకర్యం అయిన ఆర్టీసీ సరుకుల రవాణా తో మరింత గుర్తింపును తెచ్చుకున్నది.
జూన్ 19 2020న ప్రారంభించిన ఆర్టీసీ పార్సిల్, కార్గో సేవలు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఆర్టీసీ బస్సులు వెళ్లే దేశంలోని పలు రాష్ర్టాలకు కార్గో సేవలు అందుతున్నాయి. దీంతో ప్రజలకు సత్వర సేవలు అందడమే కాకండా ఆర్టీసీకి ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. కార్గో కేంద్రాలు ఏర్పాటు చేసుకున్న నిరుద్యోగులకు ఉపాధి కూడా లభిస్తున్నది. బస్సు వెళ్లే ప్రతి గ్రామానికి కార్గో, పార్సిల్ సర్వీస్ సేవలు అందాలనే ఉద్దేశంతో జిల్లాలోని ఆయా మండలాల్లో ప్రైవేటు వ్యక్తులకు కమీషన్ బేసిస్లో ఏజెన్సీలు ఇస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 11 ఏజెన్సీలకు అప్ప జెప్పగా త్వరలో మరిన్ని ఏజెన్సీలతో కార్గో సెంటర్లనే ప్రా రంభించన న్నట్లు సమాచారం. పట్టణాల్లో రూ.5వేలు, మండలాల్లో రూ.వెయ్యి డిపాజిట్ చేయిం చుకొని నిబంధనల మేరకు అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చే పార్సిళ్లను వినియోగదారులకు అందజేయడం, గ్రామాల నుంచి పార్సిళ్లను బుక్ చేయడం ద్వారా రెండు రకాలుగా కమీషన్ ప్రైవేటు ఏజెన్సీలకు అందుతున్నది.
ట్రాన్స్పోర్టుకు బదులుగా…
ఆర్టీసీ బస్సులు ప్రతి రోజూ రాష్ట్రంలోని అన్ని పల్లెలు, పట్టణాలు, నగరాలకు వెళుతూ లక్షలాది మందికి రవాణా సౌకర్యం కల్పిస్తున్నది. అదే మాదిరిగా ఇక ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరుకు రవాణా చేసేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వంలోని వివిధ శాఖల ద్వారా జరిగే సరుకు రవాణాను ‘ఆర్టీసీ కార్గో, పార్సిల్’ ద్వారానే ఎక్కువ మొత్తంలో జరుగుతున్నది. ముఖ్యంగా విద్యా సంస్థల పుస్తకాలు, బతు కమ్మ చీరలు, దవాఖానలకు మందులు ఇలా ప్రభుత్వ పరంగా జరిగే ప్రతి సరుకు రవాణా ఆర్టీసీ ద్వారానే జరిగేట్లు కార్యాచరణ రూపొందించారు. ప్రైవేటు ట్రాన్స్పోర్టుకు బదులుగా ప్రతి ఒక్కరూ ఆర్టీసీలోనే తమ సరుకులను రవాణా చేయాలని అధికారులు కోరుతున్నారు. ఆర్టీసీకి దాదాపు 80 శాతం ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉండడంతో కార్గో, సర్వీసు సేవలు గంటల వ్యవధిలోనే గమ్య స్థానాలకు చేరుతున్నాయి. ప్రైవేటు కొరియర్ సర్వీసులతో పోల్చుకుంటే ఆర్టీసీలో చార్జీలు చాల తక్కువగా ఉన్నాయి.
తక్కువ ధరకు ఎక్కువ సౌకర్యం
వేగంగా, భద్రంగా ప్రజల చేరువలోకి వస్తువుల సరఫరా అనే నినాదంతో ఆర్టీసీ కార్గో, పార్సిల్ సేవలు ప్రారంభించారు. ప్రస్తుతం ఆయా రూట్లలో నడుస్తున్న బస్సుల్లోనే వస్తువులు, లెటర్లు, కొరి యర్ తదితర సేవలను కొనసాగిస్తాం. ప్రధాన నగరాల నుంచి ఎక్కువ మొత్తంలో సరుకులు ఉంటే ప్రత్యేక కార్గో బస్సులు వస్తున్నాయి. ప్రైవేటు ట్రాన్స్పోర్టు కంటే తక్కువ డబ్బులతో ఆర్టీసీ ప్రజలకు స్పీడుగా సేవలను అందిస్తున్నది. తక్కువ ధరకు ఎక్కువ సౌకర్యం కల్పించే ఆర్టీసీ సేవలను ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలి.
– టి.సమత, ఆర్టీసీ డీపో మేనేజర్, తాండూరు