ఆమనగల్లు, నవంబర్ 20 : కుల , చేతి వృత్తుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మత్స్యకారుల ప్రయోజనాన్ని కాంక్షించి కల్వకుర్తి నియోజకవర్గంలోని 6 మండలాల పరిధిలో గల 650 నోటిఫైడ్ చెరువులు, కుంటలు, చెక్డ్యామ్లో 80 లక్షల చేప పిల్లలను వదులుతున్నట్లు వివరించారు. ఆమనగల్లు పట్టణంలోని సురసముద్రం చెరువులో ఆదివారం మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపపిల్లలు వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా వెయ్యి మత్స్యకార సొసైటీల ఏర్పాటుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందన్నారు. మత్స్యకారులు చేపల మార్కెటింగ్ చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం రాయితీతో కూడిన మోపెడ్లు, వలలు, చేప ఐస్బాక్సులు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) అధికారంలోకి వచ్చాకే కుల వృత్తులకు పూర్వ వైభవం వచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని కుల వృత్తుల వారు ఆర్థికంగా బలపడాలని సూచించారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పథకాలను అమలు చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేశ్, ఏఎంసీ చైర్మన్ నాలపురం శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, మత్స్యశాఖ ఏడీఏ సుకీర్తి, మున్సిపాలిటీ చైర్మన్ రాంపాల్, వైస్ చైర్మన్ దుర్గయ్య, కౌన్సిలర్లు కమటం రాధమ్మ, నాయకులు అప్పం శ్రీనివాస్, దుడ్డు ఆంజనేయులు, పరమేశ్, కిరణ్ పాల్గొన్నారు.
ప్రతిపక్షాలకు భవిష్యత్ లేదు
మాడ్గుల : రాష్ట్రంలో ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ప్రతి పక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. ఆదివారం మండలంలోని గుడితండాకు చెందిన కాంగ్రెస్ నుంచి 40 మంది నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి తప్ప వేరే పార్టీలకు భవిష్యత్ ఉండదన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ శంకర్ నాయక్, ఎంపీటీసీ వెంకటేశ్, రమేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయం
మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నా రు. మండలంలోని మాడ్గుల, పాత బ్రాహ్మణపల్లి, ఇర్విన్ గ్రామాల్లోని చెరువుల్లో చేప పిల్లలను వదిలారు. కార్య క్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జైపాల్రెడ్డి, సర్పంచ్లు జంగయ్య, లక్ష్మయ్య, మాజీ జడ్పీటీసీ రవి, నాయకులు కృష్ణారెడ్డి, విష్ణు, మహేశ్, జంగయ్య, యాద య్య, తిరుపతి, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు.