ధారూరు,అక్టోబర్ 4: ప్రజలకు సురక్షిత తాగునీరు అందించాలని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం ధారూరు మండల పరిధిలోని డీకే తండా, ధారూరు స్టేషన్ గ్రామంలో ‘మీతో నేను’ కార్యక్రమంలో భాగంగా మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో పరి శుభ్రత పాటించడం లేదని, శానిటేషన్ సక్రమంగా నిర్వహించడం లేదని సంబందిత అధి కారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామంలో పాడుబడ్డ ఇండ్లు, పిచ్చి మొక్కలు తొల గించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. గ్రామంలో 2,3,4,8 వార్డుల్లో నీటి సమ స్య ఉందని, తక్షణమే చర్యలు చేపట్టాన్నారు. ప్రతి ఇంటికీ మిషన్భగీరథ ద్వారా తాగునీరు అందించే విధంగా చూడాలన్నారు. మిషన్ భగీరథ నీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నెలకు మూడు సార్లు మిషన్ భగీరథ తాగు నీటి ట్యాంక్ను శుభ్రం చేయాలన్నారు. ప్రతి శుక్రవారం పశువుల డాక్టర్ అందుబాటులో ఉండి పశువులకు వైద్య సేవలు అందించాలని పశువైద్య అధికారులను అదేశించారు. అనంతరం గ్రామానికి చెందిన ముత్యాల్ బాయ్కి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు.
ఈ కార్య క్రమంలో ధారూరు ఎంపీడీవో చంద్రశేఖర్, తహసీల్దార్ భువనేశ్వర్, మండల వ్యవసా య అధికారి జ్యోతి, ఏపీవో సురేశ్, గ్రామ సర్పంచ్ రేణుకా శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ సంతోష్కుమార్, వైస్ చైర్మన్ అంజయ్య, మండల రైతు సమన్వయ కమిటీ అధ్య క్షుడు వెంకటయ్య, నాయకులు వేణుగోపాల్ రెడ్డి, కావలి అంజయ్య, శ్రీనివాస్, వెంకట్ రాములు, రవిశంకర్, దేవేందర్, బాబురావు, సోమ్లనాయక్, సుబాన్జీ, చంద్రమౌళి, యాదయ్య, అనిల్, విజయ్కుమార్, రవికుమార్, లక్ష్మయ్య, బాల్రాజ్ నాయక్, సుధాకర్గౌడ్, చెన్నయ్యగౌడ్, యాత్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ధారూరు మండల పరిధిలోని తరిగోపుల గ్రామానికి చెందిన నలుగురు లబ్ధిదారులకు జిల్లా ఎస్టీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మంజూరైన నాలుగు బొలెరో గూడ్స్ వాహనాలను క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఆనంద్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధి కారులు కోటాజీ, గోపాల్, ప్రజా ప్రతి నిధులు, పార్టీ నాయకులు ఉన్నారు.
ధారూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు సబితా ఆనంద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ విశ్వం మొత్తం విజ్ఞానంతోనే నడుస్తున్నదన్నారు. గ్రామాల్లోని బాల బాలికలు అందరూ కచ్చితంగా పాఠశాలలో ఉం డేలా చూడాలన్నారు. సంపూర్ణ అక్ష్యరాస్యత దిశగా అడుగులు వేయాలన్నారు.