గాంధీ ఆచరించిన అహింసా మార్గం ప్రపంచానికి ఆదర్శమని ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, అంజయ్యయాదవ్, కాలె యాదయ్య, జైపాల్యాదవ్ అన్నారు. ఆదివారం గాంధీ జయంతి సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో గాంధీ విగ్రహాలు, చిత్రపటాలకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ సేవలను గుర్తు చేశారు. స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ అహింసా విధానంతో ఎన్నో ఉద్యమాలు నడిపించారన్నారు.
కొత్తూరు, అక్టోబర్ 2: అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గాంధీ ప్రపంచానికే ఆదర్శనీయంగా నిలిచాడని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మధుసూదన్రెడ్డి సొంత నిధులతో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో అహింసా మార్గంలో స్వాతంత్య్రం సాధించిన ఏకైక దేశం మన భారతదేశమేనన్నారు. గాంధీ లాంటి వ్యక్తి మన దేశంలో జన్మించడం మనకు గర్వకారణమన్నారు. కొత్తూరు మున్సిపాలిటీ, మండలంలోని పలు గ్రామాల్లో గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలేసి నివాళులర్పించారు. మున్సిపల్ చైర్పర్సన్ లావణ్యతిమ్మాపూర్లో, జడ్పీటీసీ శ్రీలత నివాళులర్పించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, వైస్ చైర్మన్ డోలి రవీందర్, తహసీల్దార్ రాములు, ఎంపీడీవో శరత్చంద్రబాబు, నాయుకులు దేవేందర్, ఎమ్మె సత్యనారాయణ, మామిడి శ్యాంసుందర్, మునిపల్ కమిషనర్ వీరేందర్, ఎంపీటీసీలు రవీందర్రెడ్డి, రాజేందర్గౌడ్ పాల్గొన్నారు.
మహాత్ముడు ఆదర్శప్రాయుడు
స్వాతంత్య్ర సమరయోధుడు, అహింసావాది, జాతిపిత గాంధీ జయంతిని ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. షాద్నగర్ మున్సిపాలిటీ గంజ్రోడ్డులోని గాంధీ, లాల్బహదూర్శాస్త్రి విగ్రహాలతో పాటు ఫరూఖ్నగర్లోని గాంధీ విగ్రహానికి ఆదివారం ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహింసా వాదంతో దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించి పెట్టిన మహనీయుడు గాంధీ అని కొనియాడారు. స్వాతంత్య్ర ఉద్యమంలో లాల్బహదూర్శాస్త్రి సేవలు చిరస్మరణీయమన్నారు. మహనీయులు నడిచిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు. అదే విధంగా పట్టణంలోని శ్రీ కన్యకాపరమేశ్వరి దేవాలయం ముందు ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజ్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ ఖాజా ఇద్రీస్ అహ్మద్, కౌన్సిలర్ శ్రీనివాస్, అంతయ్య, శ్రీనివాస్, మాధురి పాల్గొన్నారు.
అడుగుజాడల్లో నడవాలి
గాంధీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడిచి, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల కేంద్రంలో డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గాంధీజీ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్నాయక్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్లు లక్ష్మీనర్సింహారెడ్డి, తులసీరాంనాయక్, ఎంపీటీసీలు లచ్చిరాం, ప్రియ, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
గాంధీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆమనగల్లు మున్సిపాలిటీలోని గాంధీ విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించారు. అనంతరం ఆమనగల్లు మున్సిపాలిటీలోని మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అనురాధ, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ తోట గిరియాదవ్, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు పత్యానాయక్, ఎంపీటీసీ కుమార్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అప్పం శ్రీనివాస్ పాల్గొన్నారు.
మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి
శంకర్పల్లి : మహనీయుల జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఆదివారం గాంధీ, లాల్బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో వారి చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో చైర్పర్సన్ విజయలక్ష్మి, జడ్పీటీసీ గోవిందమ్మ, వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, కౌన్సిలర్లు శ్వేత, లక్ష్మమ్మ, రాధ, అశోక్, రాములు, వాణి, చంద్రమౌళి పాల్గొన్నారు.
నియోజకవర్గంలో ఘనంగా గాంధీ జయంతి..
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గాంధీ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడ గ్రామంలోని గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ గాంధీ మార్గంలో నడవాలన్నారు. నియోజకవర్గంలోని మంచాల, యచారం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతో పాటు ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, పెద్దఅంబర్పేట్, తుర్కయాంజాల్ మున్సిపాలిటీల పరిధిలో గాంధీ జయంతి సందర్భంగా చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పించారు.
తుర్కయాంజాల్ : జాతిపిత గాంధీ చూపిన అహింస మార్గంలో నడవాలని డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అన్నారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి తొర్రూర్, బ్రాహ్మణపల్లిలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, కౌన్సిలర్ శివలింగం గౌడ్, తుర్కయాంజాల్ రైతుసేవా సహకార సంఘం డైరెక్టర్ సామ సంజీవరెడ్డి, స్వప్న శ్రీనివాస్, నాయకులు సంపతీశ్వర్రెడ్డి,యాదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మంచాల : మండల వ్యాప్తంగా గాంధీ జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి యువజన సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ జీవిత చరిత్రను నాయకులు, ప్రజాప్రతినిధులు వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
షాబాద్ : గాంధీజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని షాబాద్ సీఐ గోపగాని గురువయ్యగౌడ్ అన్నారు. ఆదివారం గాంధీ జయంతి సందర్భంగా షాబాద్ పోలీస్స్టేషన్లో సిబ్బందితో కలిసి గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదే విధంగా మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ప్రజాప్రతినిధులు గాంధీ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు కొలన్ ప్రభాకర్రెడ్డి, కృష్ణారెడ్డి, ఎంపీటీసీ సరళ, యువకులు తదితరులున్నారు.
షాద్నగర్ రూరల్ : ఫరూఖ్నగర్ మండలంలోని వివిధ గ్రామాల్లో సర్పంచ్లు, నాయకులు గాంధీ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన స్ఫూర్తిని కొనసాగించాలన్నారు.
చేవెళ్లటౌన్: గాంధీ ఆడుగు జాడలో ప్రతి ఒక్కరూ నడవాలని ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, ఎంపీడీవో రాజ్కుమార్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నాటి త్యాగాలను స్మరించుకున్నారు. మండలంలోని మీర్జాగూడ, సింగప్ప గూడచ చేవెళ్ల గ్రామాల్లో సర్పంచ్ భీమయ్య, రహీమా బేగం, శైలజ, టీఆర్ఎస్ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు అలీ ఆధ్వర్యంలో జయంతి నిర్వహించారు.
తలకొండపల్లి : మండల వ్యాప్తంగా గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. రాజకీయ పార్టీలు, స్వచ్చంధ సంస్థలు, యువజన సంఘాలు గాంధీ చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో గాంధీజీ పాత్ర మరువలేమన్నారు. కార్యక్రమంలో సింగిల్విండో అధ్యక్షుడు కేశవరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, యువకులు, ఆయా పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
మొయినాబాద్ : మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గునుగర్తి నక్షత్రం ఆధ్వర్యంలో గాంధీ జయంతిని నిర్వహించారు. ఎంపీటీసీలు రితీశ్రెడ్డి, రవీందర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు జయవంత్, కో ఆప్షన్ సభ్యుడు బిలాల్ నివాళులర్పించారు. కేతిరెడ్డిపల్లిలో సర్పంచ్ దారెడ్డి శోభ ఆధ్వర్యంలో, అజీజ్నగర్లో టీఆర్ఎస్ నాయకులు మాణిక్రెడ్డి, రాజు, డెవిడ్, మిట్టుల ఆధ్వర్యంలో, మండల కేంద్రంలో దర్శన్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు.
చేవెళ్ల రూరల్ : మండల పరిధిలోని పలు గ్రామాల్లో గాంధీ విగ్రహాలు, చిత్రపటాలకు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముడిమ్యాల గ్రామంలో సర్పంచ్ శేరి స్వర్ణలత, ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి నివాళులర్పించారు. కార్యక్రమంలో రామాలయ కమిటీ అధ్యక్షుడు వంగ శ్రీధర్రెడ్డి, వార్డుసభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.