కడ్తాల్, అక్టోబర్ 2: గిరిజనుల సమగ్రాభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమని, రిజ ర్వేషన్ల పెంపుతో గిరిజనుల జీవితాల్లో ఎంతో మార్పు వస్తుందని జడ్పీటీసీ దశరథ్ నాయక్ అన్నారు. సీఎం కేసీఆర్ గిరిజనుల రిజర్వేషన్ను పదిశాతానికి పెంచడాన్ని హర్షిస్తూ ఆదివారం మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో జడ్పీటీసీ దశరథ్నాయక్ ఆధ్వర్యంలో గిరిజనులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గిరిజనుల ఆరాధ్యదైవమని, రిజర్వేషన్ను పెంచిన ఆయనకు గిరిజనులందరూ రుణపడి ఉంటారన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మహా నాయకుడని కొనియాడారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. రిజర్వేషన్ల పెంపుతో గిరిజన విద్యార్థులు, నిరుద్యోగులకు విద్యాఉద్యోగ రంగాల్లో ఎంతో మేలు జరుగు తుం దన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్గుప్తా, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు శ్రీనివాస్రెడ్డి, మండలాధ్యక్షుడు వీరయ్య, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, ప్రియానాయక్, సర్పంచ్లు లక్ష్మీనర్సింహారెడ్డి, తులసీరాంనాయక్, ఏఎంసీ, పీఏసీఎస్, డైరెక్టర్లు లాయక్అలీ, సేవ్యానాయక్, చందోజీ, నర్సింహ, భిక్షపతి, రామచంద్రయ్య, లక్పతీనాయక్, రాఘవ, పాండూనాయక్, శ్రీనూనాయక్, కృష్ణ, రాజు, శ్రీకాంత్, చందర్, భీమన్ తదితరులు పాల్గొన్నారు.
సీఎంకు రుణపడి ఉంటాం
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని గిరిజన సంఘాల నాయకులు పేర్కొన్నారు. గిరిజనుల రిజర్వేషన్ను పది శాతానికి పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని హర్షిస్తూ ఆదివారం గిరిజన సంఘాల నాయకులు, టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి ధారూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సబ్బండ వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. రిజర్వేషన్ల పెంపుతో గిరిజనుల జీవితాల్లో ఎం తో మార్పు వస్తుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజూనాయక్, ప్రధాన కార్యదర్శి అంజయ్య, రైతు సమన్వయ కమిటీ మండలాధ్యక్షుడు వెంకటయ్య, నాయకులు అంజయ్య, వెంకటయ్య, వీరేశం, నర్సింహులు, దేవేందర్, లక్ష్మయ్య, భీమ్సేన్రావు, సుధాకర్గౌడ్, అంజయ్య, అనంతయ్య, యాదయ్య,
జీవో జారీని హర్షిస్తూ..
బొంరాస్పేట, అక్టోబర్ 2: గిరిజనులకు విద్యాఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ను ఆరు నుంచి పది శాతానికి పెంచుతూ ప్రభుత్వం జీవోను జారీ చేయడాన్ని హర్షిస్తూ ఆదివారం మండలంలోని సూర్యానాయక్తండాలో సర్పంచ్ స్వాతి, టీఆర్ఎస్ నాయకులు హీర్యానాయక్, రూప్లానాయక్, శంకర్నాయక్, అని ల్, మోహన్నాయక్ తదితరులు సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. రిజర్వేషన్ల పెంపుతో విద్యార్థులు, నిరుద్యోగులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.