మర్పల్లి, సెప్టెంబర్ 30: పల్లెల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మల్లికార్జునగిరిలో ‘మీతోనేను’ కార్య క్రమం లో భాగంగా పర్యటించి గ్రామస్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామంలోని రైతులకు పం ట పెట్టుబడికి ఏడాదికి రూ.72 లక్షలు ప్రభుత్వం అందజేస్తున్నట్లు గుర్తుచేశారు. ఇద్దరు రైతులు మృతి చెందితే వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.10 లక్షలు అందజేశామన్నారు.
గ్రామ అభివృద్ధి పనులకు రూ. 5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మల్లికార్జునగిరి, బిల్కల్, మర్పల్లి గ్రామాల మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామా ల లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందచేశారు. కార్యక్రమం లో ఎంపీపీ లలితా రమేశ్, జడ్పీటీసీ మధుకర్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ ప్రభాకర్ గుప్తా, వైస్ ఎంపీపీ మోహన్రెడ్డి, సర్పం చుల సంఘం మండలాధ్యక్షుడు శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం మండలా ధ్యక్షుడు మల్లేశం, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు నాయబ్గౌడ్, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, ఉపాధ్యక్షుడు అశోక్, మం డల ప్రధానకార్యదర్శి రాచన్న, యూత్ అధ్యక్షుడు మధుకర్, ఎంపీడీవో జగన్నాథ్రెడ్డి, తహసీల్దార్ శ్రీధర్, సొసైటి డైరెక్టర్ యాదయ్య, నాయకులు గౌస్, రాచయ్య, గోపాల్రెడ్డి, గఫా ర్, మిత్ర, ఖాజా, వసంత్కుమార్ ఆయా శాఖల అధికారులు, సర్పం చులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.