బొంరాస్పేట, సెప్టెంబర్ 28 : పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీపీ హేమీబాయి, వైస్ ఎంపీపీ సుదర్శన్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని తుంకిమెట్ల, నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో మహిళలకు వారు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ తిరుపతయ్య, సర్పంచ్లు స్వరూప, హన్మంతు, టీఆర్ఎస్ నాయకులు అంజిలయ్య, అంజిల్రెడ్డి, విఠల్నాయక్ పాల్గొన్నారు.
బంట్వారం, సెప్టంబర్ 28 : రాష్ట్రంలోని ప్రతి ఆడపడుచుకు బతుకమ్మ చీరలను అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని సర్పంచ్ నర్సింహులు అన్నారు. బుధవారం మండలంలోని బస్వపూర్ గ్రామంలో బతుకమ్మ చీరలను ఆయన పంపిణీ చేశారు. యాచారం, మాలసోమారం, తొరుమామిడి తదితర గ్రామాల్లో సర్పంచ్లు, వార్డు సభ్యులు చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు బల్వంత్రెడ్డి, నర్సింహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దోమ, సెప్టెంబర్ 28 : మండల పరిధిలోని గూడూరు గ్రామంలో సర్పంచ్ చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారు. మైలారం, బొంపల్లి, గుండాల గ్రామాల్లో సర్పంచ్లు రాజునాయక్, కోళ్ల సురేశ్, సుజాతవెంకట్రెడ్డి ఆయా గ్రామాల్లో ఎంపీటీసీలతో కలిసి బతుకమ్మ చీరలను మహిళలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బొంపల్లి ఎంపీటీసీ రాములు, గుండాల ఎంపీటీసీ బసయ్య, మైలారం ఎంపీటీసీ రాములునాయక్, పంచాయతీ కార్యదర్శులు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.
పెద్దేముల్, సెప్టెంబర్ 28 : మండల పరిధిలోని మంబాపూర్, ఓమ్లానాయక్ తండాల్లో సర్పంచ్ శ్రావణ్కుమార్, ఓమ్లానాయక్ తండా సర్పంచ్ రుక్కిబాయి మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మంబాపూర్ ఎంపీటీసీ శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు నారాయణరెడ్డి, డీలర్లు వీరయ్య, విజయ్, నాయకులు వెంకటయ్య, నరేశ్ పాల్గొన్నారు.