కడ్తాల్, సెప్టెంబర్ 22 : రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం వైపే ప్రజలు నిలుస్తారని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గురువారం కడ్తాల్ మండల కేంద్రంలోని కేశవరెడ్డి గార్డెన్స్లో నిర్వహించిన కార్యక్రమంలో సాలార్పూర్ గ్రామం ఎంపీటీసీ ప్రియ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన 80 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన మాజీ సర్పంచ్లు అంతమ్మ, గుండ్యానాయక్, మాజీ ఎంపీటీసీ సాయిలు, మాజీ వార్డు సభ్యులు దాస్యా, బోత్యానాయక్, విష్ణు, రాములు, యాదయ్య, సిలారి, హాజీ, అమ్జాద్బాషా తదితరులకు ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పారు. అనంతరం జడ్పీటీసీ దశరథ్నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై నమ్మకం లేకపోవడంతోనే ప్రజలు స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు రాష్ట్రంలో అలజడిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.20 కోట్లతో కడ్తాల్ గ్రామం నుంచి సాలార్పూర్ మీదుగా పడకల్ గేట్ వరకు డబుల్ రోడ్డును నిర్మిస్తామని, సాలార్పూర్ గ్రామంలో వక్ఫ్ బోర్డు భూ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. అంతకుముందు మండల కేంద్రంలో టీఆర్ఎస్ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోలీ శ్రీనివాస్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, మాజీ ఎంపీపీ సువాలీపంతూనాయక్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్లు కృష్ణయ్య, కమ్లీబిచ్చానాయక్, భాగ్యమ్మ, యాదయ్య, ఎంపీటీసీలు గోపాల్, లచ్చిరాంనాయక్, రమేశ్నాయక్, మంజుల, ఏఎంసీ డైరెక్టర్ లాయక్అలీ, ఉప సర్పంచ్లు రామకృష్ణ, వెంకటేశ్ పాల్గొన్నారు.
తెలంగాణలో టీఆర్ఎస్కు తిరుగులేదు
ఆమనగల్లు : ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో టీఆర్ఎస్కు తిరుగులేదని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. గురువారం ఆమనగల్లు పురపాలక సంఘం పరిధిలోని ముర్తుజపల్లి గ్రామానికి చెందిన సుమారు 70 మంది కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని, ఇతర రాష్ర్టాల ప్రజలు కూడా కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలపై ఆరా తీస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాలకు రావాలని యావత్ దేశ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.
సీఎం కేసీఆర్ నాయకత్వం లో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మండల వైస్ చైర్మన్ గిరియాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోనుగోటి అర్జున్రావు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు నిట్ట నారాయణ, నాయకులు కేశవులు, నిరంజన్, జైరాం నాయక్, వెంకటయ్య, రమేశ్, విక్రమ్, వగ్గు శ్రీశైలం, బాబు, జంగయ్య, భాస్కర్, ప్రదీప్, శివలింగం, యాదయ్య పాల్గొన్నారు.