షాద్నగర్టౌన్, సెప్టెంబర్ 22 : జ్వరం, జలుబు, తల, చేతులు, కాళ్ల నొప్పులు ఉన్నా, ఆరోగ్యం బాగలేకున్నా వెంటనే ఏదో ఒక గోలీలు లేదా సూది మందు వేసుకునేవారు. అనారోగ్యం క్షీణిస్తే తప్ప దవాఖానకు వెళ్లేవారు కాదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వైద్య సేవల్లో ఎవరూ ఊహించని మార్పులొచ్చాయి. ప్రస్తుతం కార్పొరేట్ దవాఖానలో ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారో అలాంటి సేవలే ప్రభుత్వ దవాఖానలో ప్రజలకు అందుతున్నాయి. ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ప్రతి ప్రభుత్వ దవాఖానలో మెరుగైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వ దవాఖానలను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ దవాఖానలో కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించే విధంగా సర్కార్ కృషి చేస్తున్నది. షాద్నగర్ నియోజకవర్గ ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్య సేవలను అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవలే షాద్నగర్ పట్టణంలో వందపడకల దవాఖాన నిర్మాణ పనులకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ శంకుస్థాపన చేశారు. పట్టణంలో వందపడకల దవాఖానను ఏర్పాటు చేయడంపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రూ. 20.89కోట్లతో దవాఖాన ఏర్పాటు
షాద్నగర్ నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వైద్య సేవల కోసం షాద్నగర్ ప్రభుత్వ దవాఖానకు వస్తుంటారు. ప్రతి రోజూ షాద్నగర్ ప్రభుత్వ దవాఖాన రోగులతో రద్దీగా మారుతున్నది. అదే విధంగా ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరిగినా వెంటనే క్షతగాత్రులను ఇక్కడికే తీసుకొస్తారు. గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించేవారు. దీంతో ప్రభుత్వ దవాఖానకు వచ్చే ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలను అందించేలానే సంకల్పంతో షాద్నగర్ పట్టణంలో రూ. 20.89కోట్లతో వందపడకల దవాఖాన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
షాద్నగర్ పట్టణ శివారులోని అలీసాబ్గూడ రెవెన్యూ పరిధిలోని సుమారు 5.26ఎకరాల్లో ఈ దవాఖాన నిర్మాణ పనులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ ఇటీవలే ప్రారంభించారు. కార్పొరేట్ దవాఖాన స్థాయిలో నిర్మించనున్న ఈ వందపడకల దవాఖానలో ఆపరేషన్ థియేటర్లు, ప్రతి పడక వద్ద ఆక్సిజన్ సరఫరా, పల్స్ మిషన్లు, వైద్య పరీక్షలు, విశ్రాంతి గదులు, అల్పాహార గదులు, దవాఖానకు వచ్చే రోగుల బంధువులు సేదతీరేందుకు ప్రత్యేక గదులు, వాహనాల పార్కింగ్, అంబులెన్స్లు, రక్తపు నిల్వ గదులను ఏర్పాటు చేయనున్నారు. పట్టణంలోని డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. దీంతో డయాలసిస్ రోగులకు ప్రత్యేక వైద్య సేవలు అందనున్నాయి. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ప్రజల కల అత్యాధునిక వసతులతో వందపడకల దవాఖాన ఏర్పాటుతో నెరవేరనున్నది.
తక్షణ వైద్య సౌకర్యం
షాద్నగర్లో నిర్మించనున్న వందపడకల దవాఖానతో సామాన్య ప్రజలతో పాటు రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ వైద్యం అందనున్నది. ఈ దవాఖానలో ఖరీదైన వైద్య పరీక్షలు ఉచితంగా చేయనున్నారు. షాద్నగర్ ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే విధంగా తెలంగాణ సర్కార్ కృషి చేస్తున్నది. ఏ ఒక్కరూ కూడా వైద్య కోసం ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో కార్పొరేట్స్థాయిలో వైద్యం అందించేలా వందపడకల దవాఖాన నిర్మాణాన్ని చేపట్టింది. కార్పొరేట్ దవాఖానల్లో అందించే వైద్య సేవలకు దీటుగా ఈ దవాఖానలో వైద్యం అందించనున్నది. వందపడకల దవాఖాన ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యే అంజయ్యయాదవ్కు నియోజకవర్గ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
దవాఖాన ఏర్పాటుకు ఎమ్మెల్యే కృషి
షాద్నగర్లో వందపడకల దవాఖాన ఏర్పాటుకు ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ ఎంతో కృషి చేశారు. షాద్నగర్ నియోజకవర్గం అభివృద్ధితో పాటు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కృషి చేస్తున్నారు. ఆరోగ్యం క్షీణించినా, రోడ్డు ప్రమాదాలు సంభవించినా ఇక్కడ ప్రథమ చికిత్స అందించినప్పటికీ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తుంటారు. హైదరాబాద్ తరలించేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలనే దృఢ సంకల్పంతో ఎమ్మెల్యే షాద్నగర్లోనే అన్ని రకాల వైద్య సేవలను అందించే విధంగా వందపడకల దవాఖాన ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.
కార్పొరేట్స్థాయిలో వైద్యం
వందపడకల దవాఖాన ఏర్పాటుతో షాద్నగర్తో పాటు ఇతర ప్రాంత ప్రజలకు కార్పొరేట్స్థాయిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. పేద ప్రజలకు మేలు చేకూరుతున్నది. దవాఖానను ఏర్పాటు చేస్తున్న సర్కార్కు కృతజ్ఞతలు.
– బాలాజీ ఉదయ్, తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం తాలుకా కన్వీనర్ షాద్నగర్
మెరుగైన వైద్య సేవలు
షాద్నగర్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వందపడకల దవాఖాన ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి. మెరుగైన వైద్యం కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రజల కోసం వందపడకల దవాఖానను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది.
-రాజశేఖర్, టీఆర్ఎస్ నాయకుడు షాద్నగర్
దవాఖానకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ (ఫైల్)