సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందే అంటున్న ధార్మిక వేత్తలు
అన్ని రంగాలపై అపార అనుభవం ఉన్న సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే దేశం సుభిక్షమవుతుందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన దేశ రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యముందని ధార్మిక వేత్తలు ముక్తకంఠంతో వెల్లడిస్తున్నారు. ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో సీఎం కేసీఆర్ను మించినవారు లేరన్నారు. ఆయన చేసిన యాగాలు, పూజలు ఫలించడంతోనే వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో తెలంగాణ రాష్ట్రం కళకళలాడుతుందన్నారు. మన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు దేశ ప్రజలందరికీ అందాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఒక ఆధ్యాత్మిక వేత్త అని, ఆయన పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో సీఎం కేసీఆర్ను మించిన వారు లేరని పలువురు ధార్మికవేత్తలు, పురోహితులు పేర్కొంటున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ అనేక ఆలయాల పునర్నిర్మాణానికి కృషి చేశారని తెలిపారు. ముఖ్యంగా యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని వందలాది కోట్ల రూపాయలను ఖర్చు చేసి ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అతి తక్కువ సమయంలోనే పునర్నిర్మించడం గొప్ప విషయమని వారు అభిప్రాయపడుతు న్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని వేలాది దేవాలయాల్లో ధూప, దీప, నైవేద్య కార్యక్రమాల అమలుకు కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నారని, అర్చకులకు ప్రతినెలా వేతనాలను అందిస్తున్నారని పేర్కొంటున్నారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి ఇలాంటి కార్యక్రమాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని వారు ఆకాంక్షిస్తున్నారు.
రాష్ట్రం తరహాలోనే దేశాభివృద్ధి..
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావడం ఎంతో శుభపరిణామం. కులమతాలకతీతంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆయన పనిచేస్తున్నారు. అదే నాయకత్వం దేశానికి అవసరం. తెలంగాణ రాష్ట్రం తరహాలోనే దేశం కూడా అభివృద్ధి చెందాలంటే అది కేవలం కేసీఆర్తోనే సాధ్యం. దేశ ప్రజలు బీజేపీ పాలనతో విసిగిపోయి సరైన నాయకుడి కోసం ఎదురుచూస్తున్నారు. సీఎం కేసీఆర్ పీఎం అయితే రాష్ట్రం, దేశం అగ్రగామిలో నిలుస్తుంది. సబ్బండ వర్గాల బాధలు తీరాలంటే సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాల్సిందే. -శరత్చంద్రశర్మ, పురోహితులు గట్టుఇప్పలపల్లి తలకొండపల్లి మండలం
దేశం మరింత బాగుపడుతుంది
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తేనే దేశం తెలంగాణ తరహాలో మరింత అభివృద్ధి సాధిస్తుంది. అన్ని అంశాలపై వారికి అవగాహన ఉన్నది. అలాంటి నేత దేశ రాజకీయాల్లో కి వస్తే ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది. బీజేపీ పాలనలో పేదలు బతకలేని పరిస్థితి నెలకొన్నది. నిత్యావసరాలు, పెట్రోల్, గ్యాస్ ధరలను పెంచారు. ఇప్పుడున్న పరిస్థితి నుంచి బయటకు రావాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందే.. -మల్లేశ్, అంబ భవానీదేవి ఆలయ పూజారి,ఉప సర్పంచుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి షాద్నగర్
ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందుతాయి
జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం
హర్షణీయం. వారి నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరం. ఆయన నిండు నూరేండ్లు ఆనందంగా జీవించాలని ప్రతిరోజూ దేవుడిని ప్రార్థిస్తున్నా. బంగారు భారత్ నిర్మాణం సీఎం కేసీఆర్తోనే సాధ్యం. ఆయన ప్రధాని అయితే దేశంలోని అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. అన్ని రకాల పథకాలు ప్రజలకు అందుతాయి. ప్రజల అవసరాలను గుర్తించి నిర్ణయం తీసుకునే శక్తి, సామర్థ్యాలు ఆయన సొంతం.
– అశోక్కుమార్, ఆంజనేయ స్వామి ఆలయ పురోహితులు, గ్రామం జుంటుపల్లి , యాలాల
దేశ రాజకీయాల్లోకి రావాల్సిందే ..
సీఎం కేసీఆర్ రాష్ర్టాభివృద్ధ్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా, దళిత బంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి పథకాలను ప్రవేశపెట్టి పేదలకు అండగా నిలిచారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ఈ సంక్షేమ పథకాలు అందుతాయి. రాజకీయ అనుభవంతోపాటు రాజకీయ చతురత, దేశాన్ని అభివృద్ధి చేయాలనే తపన ఉన్న నాయకుడు మన కేసీఆర్. -వెంకటదాస్,తిర్మలనాథస్వామి ఆలయ పీఠాధిపతి, పూడూరు మండలం
దేవాలయాలను పునర్నిర్మించారు..
దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సంక్షే మ పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణ ప్రజల ఆదరణను సీఎం కేసీఆర్ చూరగొన్నారు. అంతేకాకుండా దేవాలయాలను పునర్నిర్మించడంతోపాటు అర్చకుల సమస్యలను పరిష్కరిస్తున్నా రు. ఎనిమిదేండ్ల పాలనలో తనదైన మార్కు అభివృద్ధిని చూపి దేశానికి దిక్సూచిగా రాష్ర్టాన్ని నిలిచారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టి.. ప్రధాని అయితే తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు అందుతాయి.
– దొడ్ల రాములుగౌడ్,ఆధ్యాత్మిక గురువు, కవి, రచయిత, అంతారం గ్రామం, చేవెళ్ల మండలం
జనం మెచ్చిన నాయకుడు ..
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. ఆలయాల పునర్నిర్మాణానికి కృషి చేసిన ఏకైక సీఎం మన కేసీఆరే. తెలంగాణలోని పథకాలు దేశం మొత్తం అమలు కావాలని ప్రజలు కోరుతున్నారు. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్తేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. సంక్షేమం, అభివృద్ధి ఆయనతోనే సాధ్యమవుతుంది. సీఎం కేసీఆర్ లాంటి ముందు చూపున్న నాయకుడు దేశాన్ని అత్యవసరం.
– రాంచంద్రయ్య, ఆధ్యాత్మిక గురువు, లక్ష్మీనర్సింహస్వామి ఆలయ పూజారి,వెంకన్నగూడెం గ్రామం, చేవెళ్ల మండలం
సమర్థుడు సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ అర్చకులకు ప్రతినెలా వేతనాలు ఇచ్చి ఆదుకుంటున్నారు. సీఎం కేసీఆర్ చేసిన యజ్ఞ, యాగాల పుణ్యమే ఈ రోజు బంగా రు తెలంగాణగా మారింది. చిన్న రాష్ట్రమైనా అభివృద్ధిలో దేశంలోనే మొదటి వరుసలో నిలిచింది. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే హిందూ దేవాలయాలు మరింత అభివృద్ధి చెందుతాయి. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల సమర్థుడు ఆయన . జాతీయ రాజకీయాల్లోకి సీఎం రాకను దేశ పౌరుడిగా స్వాగతం పలుకుతున్నా.
-పురంతు శివకుమార్, అంతప్ప బావి శివాలయం పురోహితులు, గంజిరోడ్ తాండూరు
పురోహితులకు సీఎం కేసీఆర్తోనే గుర్తింపు
ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నా రు. తెలంగాణ ఏర్పాటు తర్వాతే పురోహితులకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆలయాల పునర్నిర్మాణానికి ఆయన ఎంతగానో కృషి చేస్తున్నారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే దేశం మరింత అభివృద్ధి సాధిస్తుంది. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయి.
-వేదాంతం కృష్ణమాచార్య, పురోహితులు ఇబ్రహీంపట్నం దేవాలయాలు అభివృద్ధి చెందుతాయి
గత ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు పూజారులు, ఆలయాలను పట్టించుకోలేదు. కానీ, సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి దేవాలయాల పునర్నిర్మాణానికి విశేషంగా కృషి చేస్తున్నారు. ఆలయాల్లో పూజారులను నియమించి వారికి ప్రభుత్వం తరఫున వేతనాలను అందిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి ఏడాది ప్రత్యేక నిధులను కేటాయిస్తూ దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నారు. కేసీఆర్తోనే పురోహితులకు ప్రత్యేక గుర్తింపు లభించింది.
-శేఖర్, పూజారి ఇబ్రహీంపట్నం
విజన్ ఉన్న నాయకుడు..
తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది. ఆయన జాతీయ పార్టీని పెట్టి, ప్రధాని అయితే అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలందరూ బాగుపడుతారు. ముందుచూపు ఉన్న సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఎంతో ఉన్నది. యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణానికి ఆయన ఎంతో కృషి చేశారు.
-యాదగిరి, అర్చక, ఉద్యోగ జేఏసీ రాష్ట్రరాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కడ్తాల్ మండలం