ఉద్యాన సాగులో రంగారెడ్డి జిల్లాది ప్రత్యేక స్థానం. కూరగాయల సాగులో రాష్ట్రంలోనే మన జిల్లా అగ్రస్థానంలో ఉన్నది. ఏటా జిల్లా వ్యాప్తంగా 72వేల ఎకరాల్లో పండ్లు, కూరగాయల తోటలు సాగవుతుండగా.. 3 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా కూరగాయలు ఉత్పత్తవుతున్నాయి. ఇందులో 30 శాతం జిల్లా అవసరాలకు పోగా..మిగతా 70 శాతం హైదరాబాద్ మహానగరంతోపాటు ఉమ్మడి జిల్లా చుట్టూ ఉన్న ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ ఏడాది సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచేందుకు ఉద్యానవన శాఖ ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నది.
గత వానకాలంలో జిల్లాలో 51,619 ఎకరాల్లో పండ్లు, కూరగాయలు సాగవ్వగా..ప్రస్తుత వానకాలంలో అదనంగా మరో 10వేల ఎకరాలకు పెంచేలా అధికారులు అన్నదాతలను ప్రోత్సహిస్తున్నారు. అందుకోసం రాయితీలు కల్పించడంతోపాటు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2014 నుంచి ఇప్పటివరకు జిల్లాలో ఉద్యాన సాగుకు రూ.2.08కోట్లు, నీటి కుంటల నిర్మాణానికి రూ.1.69కోట్లు, మల్చింగ్కు రూ.28లక్షలు, శీతల గదుల కోసం రూ.8.08కోట్ల రాయితీని ప్రభుత్వం అందించింది. అలాగే బిందు సేద్యానికి ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, బీసీలకు 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం చొప్పున రాయితీ ఇస్తున్నది.
ఉద్యానవన పంటల సాగులో జిల్లాకు ప్రత్యేక స్థానం ఉండగా.. కూర గాయల సాగులో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ప్రతి ఏటా జిల్లాలో 72 వేల ఎకరాల్లో పండ్లు, కూరగాయలు సాగవుతుండగా .. దాదాపుగా మూడు లక్షల మె ట్రిక్ టన్నులకుపైగా కూరగాయలను రైతులు పండిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతోపాటు హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాలకు జిల్లా నుంచే కూరగాయల ఎగుమతి జరుగుతున్నది. కాగా ఈ ఏడాది సైతం ఇదే ఒరవడిని కొనసాగిస్తూ ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని జిల్లా లో మరింతగా పెంచేందుకు ఉద్యానవన శాఖ ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నది. గత వానకాలంలో 51,619 ఎకరాల్లో పండ్లు, కూరగాయలు సాగు కాగా.. ప్రస్తుత వానకాలంలో అదనంగా మరో 10వేల ఎకరాల్లో ఆ పంటలను సాగు చేసేలా రైతాంగాన్ని అధికారులు ప్రోత్సహిస్తున్నారు.
రంగారెడ్డి, జూలై 10(నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం నియంత్రిత సాగు విధానానికి అధిక ప్రాధాన్యమిస్తూనే ఉద్యాన పంటల సాగుకు కూడా రైతులను ప్రోత్సహిస్తున్నది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న నేలలు, నీటి లభ్యత తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఏయే పంటలకు ఏ నేలలు అనుకూలమో నిర్ణయిం చి ఆ దిశగా రైతులను చైతన్యపరుస్తున్నది. ఇందుకోసం రాయితీలను కల్పించి ఆదుకుంటున్నది. శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి పండ్ల తోటలు, కూరగాయల సాగులో రైతులకు మెళకువలను అధిస్తున్నది.
10 వేల ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెంచేలా..
జిల్లాలో సమృద్ధిగా కురుస్తున్న వర్షాలకు తోడు చెరువులు, కుంటల్లో నీరు పుష్కలంగా అందుబాటులో ఉన్నది. పెరిగిన భూగర్భజలాలతో బోరు బావుల్లోనూ నీటి నిల్వలు పుష్కలంగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో మూస పద్ధతులకు స్వస్తి చెప్పి మార్కెట్లో డిమాండ్ ఉన్న కూరగాయలను రైతులు పండిస్తే లాభాలు గడించొచ్చని ఉద్యానవనశాఖ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో ప్రతి ఏటా వానకాలంలో 72 వేల ఎకరాల్లో పండ్లు, కూరగాయల తోటలను రైతులు సాగు చేస్తున్నారు. గత వానకాలంలో జిల్లా లో 51,619 ఎకరాల్లో వివిధ రకాల పండ్ల తోటలు, కూరగాయల పంటలను రైతులు పండించారు. అయితే ప్రస్తుత వానకాలంలో సాగు విస్తీర్ణాన్ని మరో 10 వేల ఎకరాలకు పెంచేలా అధికారులు ప్రణాళికలు రూపొందించి రైతులను చైతన్యపర్చే పనిలో ఉన్నారు.
రాయితీలతో ప్రోత్సాహం
ఉద్యాన పంటల సాగుకు రాయి తీ పథకాలతో ప్రభు త్వం రైతులకు ఇతోధికంగా ప్రో త్సాహం అందిస్తున్నది. 2014 నుంచి 2022-23 వరకు జిల్లాలో సాగు చేసిన పండ్లతోటలు, కూరగాయ ల సాగుకు రూ.2.08కో ట్లు, నీటి కుంటల నిర్మాణానికి రూ.1.69 కోట్లు, మల్చింగ్కు రూ.28 లక్షలు, శీతల గదుల నిర్మాణానికి రూ.8.08 కో ట్ల రాయితీ.. బిందుసేద్యాన్ని ప్రోత్సహించేందుకు ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, బీసీ రైతులకు 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం చొప్పున రాయితీ ఇస్తున్నది. గత పదేండ్ల లో బిందు సేద్యం ద్వారా రూ.73 కోట్లు, తుంపర సేద్యం ద్వారా రూ.56 లక్షల రాయితీతో రైతులు లబ్ధ్దిపొందారు. 199 ఎకరాల్లో పాలీహౌస్లు, ఐదు ఎకరాల్లో నెట్హౌస్లను ఏర్పాటు చేసింది. ఇందుకుగాను రూ.69.93 కోట్ల ను ప్రభుత్వం ఖర్చు చేయగా 220 మంది రైతులు లబ్ధ్దిపొందారు. జిల్లాలో 162 ఎకరాల్లో మల్బరీ సాగు అవుతుండగా.. రేరింగ్ షెడ్డు నిర్మాణానికి గతంలో ఇచ్చిన రూ.లక్షను తెలంగాణ సర్కారు రూ.2లక్షలకు పెంచింది. జిల్లాలో ఇప్పటివరకు 90 రేరింగ్ షెడ్ల నిర్మా ణానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది.
కూరగాయల సాగులో అగ్రస్థానంలో జిల్లా..
జిల్లా ఆకుకూరల సాగులో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉన్నది. అనేక గ్రామాలు ఆకుకూరల సాగుకు కేరాఫ్గా నిలుస్తున్నాయి. అనేక దశాబ్దాలుగా రైతు కుటుంబాలు కూరగాయల సాగునే జీవనాధారం చేసుకుని బతుకు తు న్నాయి. చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్ తదితర ప్రాంతా లు క్యారెట్ సాగుకు పేరుగాంచాయి. ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట్, బాలాపూర్ ప్రాంతాలు ఆకుకూరలకు, షాద్నగర్ పచ్చిమిర్చి సాగుకు పేరొందింది. కూరగాయల సాగుతో ప్రతిఏటా జిల్లాలో 3లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతున్నది. వీటిలో 30 శాతం జిల్లా అవసరాలకు పోగా.. మిగతా 70 శాతం కూరగాయలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతోపాటు హైదరాబాద్ మహానగరంతోపాటు చుట్టూ ఉన్న ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. పాలకూర, చుక్కకూర, పొన్నగంటి కూర, మెంతికూర, ఎర్ర గోంగూర తదితర ఆకు కూరలతోపాటు కూరగాయలను పండిస్తూ జిల్లా రైతులు ఆర్థిక ప్రగతిని సాధిస్తున్నారు.