పరిగి, ఆగస్టు 19: బాలసదనంలో మరిన్ని వసతుల కల్పనకు కృషి చేస్తానని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం పరిగిలోని బాలసదనంలో కలెక్టర్ నిఖిల, అనాథ బాలికలతో కలిసి ఆయన కేక్ కట్ చేశారు. అనంతరం చిన్నారులకు కేక్ తినిపించి..స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్య్ర ఫలాలు ప్రతి ఒక్కరికీ అందినప్పుడే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు.
సీఎం కేసీఆర్ ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు విశేషంగా కృషి చేస్తున్నదన్నారు. అనాథ పిల్లలకు సర్కారు అండగా ఉంటుందని.. బాలసదనంలో అవసరమైన మరిన్ని వసతులను కల్పిస్తామన్నారు. అనంతరం కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ అనా థ పిల్లలకు మెరుగైన వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బాలసదనంలోని పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలన్నా రు. పిల్లల సౌకర్యార్థం అదనంగా గదులను నిర్మిస్తామన్నారు.
ఈ సందర్భంగా బాలసదనంలో వసతులను పరిశీలించి పిల్లల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు పరిగిలోని సబ్ జైలు లో ముద్దాయిలు, దవాఖానలో రోగులకు ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పండ్లు పంపిణీ చేశారు.
ఆయా కార్యక్రమాల్లో జిల్లా సంక్షేమాధికారి లలితకుమారి, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి కోటాజీ, జిల్లా షెడ్యూ ల్డ్ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేశ్వర్, జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ విమల, మైనారిటీ అభివృద్ధి శాఖ అధికారి సుధారాణి, బాలరక్షా భవన్ కో-ఆర్డినేటర్ శ్రీలక్ష్మి, ఎంపీపీ కరణం అరవిందరావు, జడ్పీటీసీ హరిప్రియ, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, ఎంపీడీవో శేషగిరిశర్మ, ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి ప్రియదర్శిని, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఆంజనేయులు, సీనియర్ నాయకుడు ప్రవీణ్కుమార్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.