ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు అట్టహాసంగా సాగుతున్నాయి. అన్ని వర్గాల వారు ఈ ఉత్సవాల్లో భాగస్వాములు అవుతున్నారు. శుక్రవారం దవాఖానలు, అనాథాశ్రమాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు రోగులు, చిన్నారులకు పండ్లు, మొక్కలను చేశారు.
షాబాద్, ఆగస్టు 19: ప్రజల్లో జాతీయభావాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య అన్నారు. శుక్రవారం వజ్రోత్సవాలను పురస్కరించుకుని చేవెళ్ల మండల కేంద్రంలోని ప్రభు త్వ దవాఖానలో ఆయన రోగులకు పండ్లను పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని షాబా ద్, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వ దవాఖానల్లోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ 15 రోజులుగా నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో వజ్రోత్సవాలు జరుగుతున్నట్లు తెలిపారు. కార్యక్రమం లో ఆయా మండలాల ఎంపీపీలు విజయలక్ష్మి, గోవర్ధ్దన్రెడ్డి, నక్షత్రం, జడ్పీటీసీలు మాలతి, గోవిందమ్మ, కాలె శ్రీకాంత్, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, ఎంపీడీవోలు రాజ్కుమార్, సంధ్య, వెంకయ్య, అనురాధ, తహసీల్దార్ శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ మండలాల అధ్యక్షులు ప్రభాకర్, మహేందర్రెడ్డి, గోపాల్, వాసుదేవ్ కన్నా, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని ఏరియా దవాఖాన, టీబీ శానిటోరియం, మహిమ మినిస్ట్రీస్ అనాథాశ్రమాల్లో డీడబ్ల్యూవో లలితకుమారి ఆధ్వర్యంలో రోగులు, అనాథల కు పండ్లు పంపిణీ చేశారు. వికారాబాద్ శిశుగృహలో చిన్నారులతో శ్రీకృష్ణ జన్మాష్టమిని ఘనంగా నిర్వహించారు. అనంతరం చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ చంద్రకళ, కౌన్సిలర్ పుష్పలతారెడ్డి, సీడీపీవో వెంకటేశ్వరమ్మ, బీఆర్బీ కో-ఆర్డినేటర్ శ్రీలక్ష్మి, బాలల సంక్షేమ సమితి సభ్యులు వెంకటేశ్, ప్రకాశ్, సూపర్వైజర్లు, ఆశవర్కర్లు పాల్గొన్నారు.