కులకచర్ల, జూలై 1: ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఇతర విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని, విద్యార్థులు తమ లక్ష్య సాధనకోసం కృషిచేయాలని కులకచర్ల తహసీల్దార్ రమేశ్ అన్నారు. శుక్రవారం కులకచర్ల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాల యం లో 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభను కనబర్చిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్రతిభకు మార్కులు మాత్రమే ప్రామా ణికం కాదని. వారి ప్రతిభకూడా ముఖ్యమేనని తెలిపారు.
కార్య క్రమంలో బండవెల్కిచర్ల బాలికల ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వరలక్ష్మి, సీఆర్పీ గాంగ్యనాయక్, సీనియర్ అసీస్టెంట్ శ్రీనయ్య, వీఆర్వోలు వెంకటయ్య, రామస్వామి, వెంకటయ్య, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా హైదరాబాద్లో జ్యోతీరావు పూలే పాఠశాలలో 10జీపీఏ సాధించిన విద్యార్థిని శరత్చంద్రను టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శేరి రాంరెడ్డి సన్మాని ంచారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్, బుచ్చ య్య, నర్సింహులు పాల్గొన్నారు.
తాండూరు రూరల్, జూలై 1:విద్యార్థులు బాగా చదు వుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని తాండూరు జడ్పీటీసీ సభ్యురాలు గౌడి మంజుల అన్నారు. శుక్రవారం తాం డూరు మండలం, చెంగోల్ జడ్పీహెచ్ఎస్ స్కూలో పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించి వైష్ణవిని సన్మా నించి, రూ.5 వేల నగదు బహుమతి అందజేశారు. ఎంఈవో వెంకటయ్యగౌడ్ మాట్లాడుతూ మండల స్థాయిలో టాపర్గా నిలవడం సంతోషంగా ఉందన్నారు. అదే విధంగా వివేకానంద యువజన సంఘం ప్రతినిధి రూ.3 వేల ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రమేశ్. మాజీ ఎంపీటీసీ గౌడి వెంకటేశం, మాజీ ఎస్ఎంసీ చైర్మన్ ఏసు, ఉపాధ్యాయులు ఉన్నారు.
బొంరాస్పేట, జూలై 1 : పదవ తరగతి పరీక్షల్లో మండల టాపర్గా నిలిచిన బొట్లవానితండా గిరిజన బాలికల ఆశ్ర మ పాఠశాల విద్యార్థిని నాగలక్ష్మీని శుక్రవారం హెచ్ఎం విక్రంసింగ్, ఉపాధ్యాయులు శరణప్ప, సురేష్, రాజన్న, అనురాధ, రేణుక, రాధిక, సులోచన, పీఈటీ నవనీత పూల మాలలు, శాలువాతో ఘనంగా సన్మానించి అభినం దించారు. నాగలక్ష్మీ 10 జీపీఏ సాధించి మండల టాపర్ గా నిలిచారు. భవిష్యత్లో ఉన్నత చదువుల్లో కూడా శ్రద్ధగా చదివి రాణించాలని ఉపాధ్యాయులు సూచిం చారు. నాగలక్ష్మీని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు బాగా చదువుకోవాలని అన్నారు.
పరిగి టౌన్, జూలై 1 : విద్యార్థులు ఇష్టపడి చదివితే అను కున్న లక్ష్యాలను సాధించవచ్చని డీఎస్పీ శ్రీనివాస్ పేర్కొ న్నారు. శుక్రవారం తుంకులగడ్డలోని గురుకుల పాఠశా లను సందర్శించి ఇటీవల పదవతరగతి, ఇంటర్ ఫలి తాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కలిసి అభినందించారు. కార్యక్రమంలో ఎస్సై విఠల్రెడ్డి పాల్గొన్నారు
కోట్పల్లి, జూలై 1: పది ఫలితాల్లో మండల టాపర్గా నిలిచిన కేజీబీవీ కోట్పల్లి బాలికల పాఠశాల విద్యార్థిని ఈశ్వరీ (10/10), 9.8 ఉత్తీర్ణత సాధించిన శ్రావణిలను మండల విద్యాధికారి చంద్రప్ప కేజీబీవీ పాఠశాల ప్రిన్స్ పాల్ పల్లవితో పాటు తోటి ఉపాధ్యాయులు సన్మానించారు.