షాద్నగర్టౌన్, జూలై 1 : ప్రజా సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలిచిందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, ఎంపీపీ ఖాజా ఇద్రీస్ అహ్మద్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, ఆర్డీవో రాజేశ్వరితో కలిసి అందజేశారు. అదేవిధంగా ఫరూఖ్నగర్ మండలం విఠ్యాల గ్రామానికి చెందిన రైతు చెన్నయ్య ఇటీవలే మృతి చెందటంతో రైతు బీమా ద్వారా మంజూరైన రూ. 5 లక్షల ప్రొసీడింగ్ను రైతు కుటుంబ సభ్యులకు అందజేశారు.
రైతుల సంక్షేమానికి ఏ ప్రభుత్వం కృషి చేయని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. రైతులకు ఏ చిన్నకష్టం లేకుండా ప్రభుత్వం చూస్తున్నదన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో వినయ్కుమార్, వైస్ ఎంపీపీ మౌనిక, సర్పంచ్ శ్రీశైలం, ఎంపీటీసీలు శివరాజ్, భార్గవ్కుమార్, కౌన్సిలర్లు వెంకట్రాంరెడ్డి, ప్రతాప్రెడ్డి, మండలాధ్యక్షుడు లక్ష్మణ్నాయక్, నాయకులు జూపల్లి శంకర్, నర్సింలు, శేఖర్, జమృత్ఖాన్ పాల్గొన్నారు.
షాద్నగర్రూరల్ : నేటి సమాజంలో వైద్యవృత్తి ఎంతో పవిత్రమైందని, వైద్యులు కనిపించే దేవుళ్లని ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా పట్టణంలోని బుగ్గారెడ్డి గార్డెన్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅథితిగా హాజరై మాట్లాడారు. భగవంతుడు పోసిన ప్రాణాలను వైద్యులు కాపాడుతున్నారని, వారిని దైవసమానులుగా చూడాలన్నారు. ప్రతి గ్రామంలో కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలను ప్రభుత్వం అందజేస్తున్నదన్నారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, మండలాధ్యక్షుడు లక్ష్మణ్నాయక్, నాయకుడు జూపల్లి శంకర్, డాక్టర్లు పాల్గొన్నారు.
నందిగామ : నందిగామ మండలం రంగాపూర్ నాట్కో హై స్కూల్ ఆవరణలో నాట్కో ట్రస్ట్, ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో కొత్తూరు, నందిగామ మండల పరిధిలోని సుమారు 300 మంది అంగన్వాడీ విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు.
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్తో కలిసి అంగన్వాడీ విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రియాంకగౌడ్, వైస్ ఎంపీపీ మంజూల, పీఏసీఎస్ చైర్మన్ మంజులారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నోముల పద్మారెడ్డి, సర్పంచ్లు రమేశ్గౌడ్, రాజూనాయక్, చంద్రారెడ్డి, సీడీపీవో నాగమణి, ఐసీడీఎస్ సూపర్వైజర్ జ్యోతి, నాట్కో ట్రస్ట్ మేనేజర్ రాంబాబు, మదన్, నాట్కో హెచ్ఆర్ మేనేజర్ సత్యనారాయణ, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
షాద్నగర్ : పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవంలో భాగంగా శుక్రవారం షాద్నగర్ పట్టణంలోని ఆర్టీసీ కాలనీ శ్రీ జగన్నాథస్వామి దేవాలయం ఆవరణలో స్వామి రథయాత్ర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు.