కొడంగల్, జూన్ 30: హక్కులతో పాటు బాధ్యతలను గుర్తించాలని ఎస్ఐ రవి, ఆర్ఐ రాంచందర్రావు అన్నారు. గురువారం పౌరహక్కుల దినో త్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని హస్నాబాద్ గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ పకీరప్ప అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అం దరూ కలిసి మెలిసి ఉన్నప్పుడే ప్రశాంతంగా జీవించవచ్చన్నారు. కార్యక్ర మంలో పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణితో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.
పెద్దేముల్, జూన్ 30 :్ల అంటరానితనాన్ని, కుల వివక్షను రూపుమాపడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని గిర్మాపూర్ గ్రామంలో పౌర హక్కుల దినోత్సవంలో భాగంగా నిర్వహించిన సమా వేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులాలు, మతాల మధ్య, వ్యక్తికి వ్యక్తికి మధ్య ఎలాంటి భేదాలు లేకుండా ఐకమత్యంతో ఉం డాలన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన వివిధ పౌరహక్కులను ప్రతి పౌరుడు అర్థం చేసుకోవాలన్నారు. సమాజంలో ఎక్కడైనా నేరం జరిగితే సమాచారాన్ని వెం టనే పోలీసులకు చేరవేయాలన్నారు. రూరల్ సీఐ రాంబాబు మాట్లాడుతూ ప్రజలకు ఏదైనా సమస్య ఉన్నా, ఎక్కడైనా నేరం జరిగిన వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ రాజేశ్వర్రావు, గ్రామ సర్పంచ్ విజయమ్మ,ఉపసర్పంచ్ ఎల్లప్ప,తాండూరు రూరల్ సీఐ రాంబాబు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు రెడ్డి,స్థానిక ఎస్ఐ అబ్దుల్ రవూఫ్, పంచాయతీ కార్యదర్శి సుశీల,నాయకులు లొంక నర్సింహులు, రాజేందర్ రెడ్డి, రాంరెడ్డి, నాగిరెడ్డి, రాంచందర్ నాయక్, సంధ్యా నాయక్, శివరాం నాయక్, రాం చంద్రారెడ్డి,గ్రామస్తులు పాల్గొన్నారు.
మర్పల్లి, జూన్ 30: సమాజంలో ప్రతి ఒక్కరూ సమానమేనని ఎస్సై రాజేంద్రప్రసాద్ అన్నారు. గురువారం మండలంలోని కల్ఖోడా గ్రామ పంచాయతీ కార్యాలయంలో పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ పౌరహక్కులపై అవగాహన ఉన్నప్పుడే సమాజంలో మార్పుకు అవకాశం ఉంటుందన్నారు. అందరూ కలిసిమెలిసి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ శివకుమార్, ఆర్ఐ మాధవరెడ్డి, హస్టల్ వార్డెన్ జి.తుల్జారామ్గౌడ్, పంచాయతీ కార్యదర్శి రవికుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు.
మోమిన్పేట, జూన్ 30: పౌర హక్కులపై ప్రజలకు అవగాహన ఉండాలని ఎంఆర్ఐ రాజు అన్నారు. గురువారం మండల పరిధిలోని చీమలదరి గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం పౌరులందరికీ సమాన హక్కులు కల్పించిందన్నారు. కార్యక్రమంలో మోమిన్పేట జమీందర్ బలరామ్, అధికారులు పాల్గొన్నారు.
కులకచర్ల, జూన్ 30 : ప్రతి ఒక్కరూ చట్టాల గురించి తెలుసుకోవాలని ఎస్ఐ గిరి అన్నా రు. గురువారం కులకచర్ల మండల పరిధిలోని బొంరెడ్డిపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ చాకలి అంజిలయ్య అధ్యక్షతన పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ మూఢనమ్మకాలను నమ్మరాదని, సమస్యలు ఉంటే చట్టం ప్రకారం పరిష్కరించుకోవాలని సూచించారు. చట్టానికి ఎవరూ చుట్టాలు కారన్నారు. కులమతాలకు దూరంగా ఉండి ఐక్యంగా తమ సమస్యలను పరిష్కరిం చుకోవాలని అన్నారు.కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ శీనయ్య, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.