రంగారెడ్డి, జూన్ 30, (నమస్తే తెలంగాణ) : పదో తరగతి ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. గురువారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో జిల్లా విద్యార్థులు 90.04 శాతం ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతి ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. జిల్లావ్యాప్తంగా 47,157 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 42,460 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 24,524 బాలురకు 21,411.. 22,633 బాలికలకు 21,049 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 87.31, బాలికలు 93 శాతం ఉత్తీర్ణత సాధించారు. మరోవైపు పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ, జడ్పీ, ఎయిడెడ్, కేజీబీవీ, రెసిడెన్షియల్, మోడల్ స్కూళ్ల విద్యార్థులు తమ సత్తా చాటారు.
జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి 96 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించడం గమనార్హం. పది జీపీఏ సాధించిన విద్యార్థుల్లో జడ్పీ స్కూళ్లకు సంబంధించి 20 మంది, ఎయిడెడ్, ఆశ్రమ స్కూల్-1, బీసీ సంక్షేమ స్కూళ్లలో 23, కేజీబీవీల్లో ఒకరు, మోడల్ స్కూళ్లలో 9, మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 11, సాంఘిక సంక్షేమ స్కూళ్లలో 28 , గిరిజన సంక్షేమ స్కూళ్లలో ఇద్దరు 10 జీపీఏ సాధించారు.
పదో తరగతి ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. నాలుగైదు నెలల ముందు నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మంచి ఫలితాలను సాధించారు. జిల్లాలోని 26 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత సాధించడం గమనార్హం. 100 శాతం ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ స్కూళ్లలో జడ్పీహెచ్ఎస్ మజీద్పూర్, జడ్పీహెచ్ఎస్(జి)ఆలూరు, జడ్పీహెచ్ఎస్ కౌకుంట్ల, జడ్పీహెచ్ఎస్ అంతారం, జడ్పీహెచ్ఎస్ ఇబ్రహీంపట్నం, జడ్పీహెచ్ఎస్ చర్లపటేల్గూడ, పోచారం, ఎక్వాయిపల్లి, కడ్తాల్, ఎంపీహెచ్ఎస్ కొండారెడ్డిపల్లి, జడ్పీహెచ్ఎస్ వేములనర్వ, కేశంపేట్, తంగేళ్లపల్లి, గూడూరు, నర్సప్పగూడ, ఔరపల్లి, జాపాల్, లింగంపల్లి, మేకగూడ, వెల్జాల్, చుక్కాపూర్, తలకొండపల్లి, చంద్రదన, చింతపట్ల, నందివనపర్తి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలు ఉన్నాయి.
పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 1 నుంచి నిర్వహించనున్నారు. ఆగస్టు 1 నుంచి 10 వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు జులై 18గా ప్రభుత్వం నిర్ణయించింది. రీ కౌంటింగ్ దరఖాస్తులను నాంపల్లి చాపెల్ రోడ్డులోని డీజీఈ తెలంగాణ కార్యాలయంలో జులై 2 నుంచి 14 వరకు అందజేయాలి. రీ వెరిఫికేషన్కు దరఖాస్తుతోపాటు హాల్టికెట్ జిరాక్స్ కాపీని జత చేసి ఎల్బీనగర్లోని జడ్పీహెచ్ఎస్ బహదూర్గూడలో దరఖాస్తు చేసుకోవచ్చు. రీ వెరిఫికేషన్కు ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 చలాన్ రూపంలో జూలై 2 నుంచి 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
పరిగి, జూన్ 30 : పదో తరగతి పరీక్షా ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. వికారాబాద్ జిల్లా పరిధిలో 14226 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా 12863 మంది(90.42శాతం) ఉత్తీర్ణులయ్యారు. వారిలో 7180 మంది బాలురకు 6265 మంది (87.26శాతం), 7046 మంది బాలికలకు 6598 మంది (93.64శాతం) పాసయ్యారు. ఉత్తీర్ణతలలో వికారాబాద్ జిల్లా రాష్ట్రంలో 24వ స్థానంలో నిలిచింది.
జిల్లా పరిధిలోని 55 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల్లో జడ్పీహెచ్ఎస్ పాఠశాలలు 17, ఎయిడెడ్ పాఠశాల ఒకటి, ఆశ్రమ పాఠశాలలు 2, మైనార్టీ గురుకులం ఒకటి, మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకులాలు 2, టీఎస్ఆర్ఈఐఎస్ 1, టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ 1, ప్రైవేట్ పాఠశాలలు 30 ఉన్నాయి. వీటిలో సల్బత్తాపూర్, మైల్వార్, చాకల్పల్లి, ధారూరు, కెరెళ్లి, కుదురుమల్ల, ఎన్నారం, మందిపల్, కొంశెట్టిపల్లి, దేవరంపల్లి, అక్నాపూర్, నరెగూడ, గంగ్యాడ, రాపోల్, ఇందూర్, అడికిచర్ల, రాస్నం జడ్పీహెచ్ఎస్లు, టీటీడబ్ల్యూఆర్ఎస్(బాలురు) కొడంగల్, టీఎస్ఆర్ఈఎస్(బాలికలు) తాండూరు, మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకులం(బాలికలు) బురాన్పూర్, మహాత్మా జ్యోతిబా పూలే గురుకులం(బాలురు) కొడంగల్, మైనార్టీ గురుకులం(బాలికలు) వికారాబాద్, గిరిజన ఆశ్రమ పాఠశాల(బాలికలు) బొట్లవానితండా, గిరిజన ఆశ్రమ పాఠశాల(బాలురు) కొత్తపల్లి ఉన్నాయి.