తలకొండపల్లి, జూన్ 24 : రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని దేవకి గార్డెన్స్లో తాసిల్దార్ కృష్ణ అధ్యక్షతన 41 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కారణజన్ముడని, పద్నాలుగేండ్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తయారు చేయడానికి నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. అన్నదాతల కోసం 24 గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలు చేస్తున్నారని, సబ్బండ వర్గాల వారికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు.
తెలంగాణలో 70 ఏండ్లలో జరగని అభివృద్ధిని సీఎం కేసీఆర్ ఏడున్నరేండ్లలో చేసి చూపించారని వివరించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ప్రజలు సంపూర్ణ మద్దతును ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల, ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, రైతు సమితి మండల అధ్యక్షుడు నర్సింహ, సర్పంచ్లు రమేశ్, చంద్రయ్య, ఎంపీటీసీ సుధాకర్రెడ్డి, తహసీల్ధార్ కృష్ణ, ఏవో రాజు, రాంపూర్ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీశైలంయాదవ్, శరత్చంద్ర, వెంకటయ్య, రమేశ్, కుమార్, రామస్వామి, శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.
కడ్తాల్ : దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. ఆమనగల్లు పట్టణంలో దళితబం ధు పథకంలో లబ్ధిదారుడికి మంజూరైన కారుని స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, జడ్పీటీసీ అనురాధ, ఏఎంసీ వైస్ చైర్మన్ గిరియాదవ్, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు నారాయణ, డైరెక్టర్లు సుభాశ్, రమేశ్నాయక్, వెంకటయ్య, సర్పంచ్లు గోదాదేవిసత్యం, వెంకటయ్య, బాలస్వామి, ఖలీల్, మల్లేశ్, ప్రశాంత్ పాల్గొన్నారు.
కడ్తాల్ : మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త కంబాలపల్లి శ్రీశైలం, మర్రిపల్లి గ్రామానికి చెందిన సౌతా శ్రీరాములు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మృతులకు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ రూ. 2 లక్షల ప్రమాద బీమా చెక్కులను స్థానిక నాయకులతో కలిసి అందజేశారు.