పరిగి, జూన్ 24 : దళితబంధు పథకంతో పేదరిక నిర్మూలన జరుగుతుందని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. పరిగి మండలం నస్కల్ గ్రామానికి చెందిన బి.ఆనందంకు దళితబంధు కింద మంజూరైన కారును శుక్రవారం పరిగిలో ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళితబంధు కింద నియోజకవర్గంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో 100 మందికి లబ్ధి చేకూరగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1500 మందికి అందనుందని చెప్పారు. దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు ఈ పథకం చక్కగా దోహదపడుతుందన్నారు. అన్ని వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పాలనలోనే కొనసాగుతున్నదని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలతో తమ కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేలా కృషి చేయాలన్నారు. కుటుంబంలోని వారు ఒక యూనిట్ లేదా అంతకంటే ఎక్కువ యూనిట్లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఈ పథకం కల్పించిందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ.సురేందర్, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు రాజేందర్, ఎంపీడీవో శేషగిరిశర్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు పాల్గొన్నారు.
కులకచర్ల, జూన్ 24 : మండల పరిధిలోని పీరంపల్లి గ్రామంలో శుక్రవారం బొడ్రాయి ప్రతిష్ఠాపన ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ రాధికసోమలింగం, గ్రామ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించగా శుక్రవారం బొడ్రాయిప్రతిష్ఠాపన చేశారు. అనంతరం బొడ్రాయికి సామూహికంగా మహిళలు బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ సత్యమ్మ, ఏఎంసీ చైర్మన్ హరికృష్ణ, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు రాజు, దోమ మండల నాయకులు నాగిరెడ్డి, పరిగి మండల నాయకులు సురేందర్కుమార్, ఆంజనేయులు, కులకచర్ల మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శేరి రాంరెడ్డి, ఉత్సవ సమితి సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.