పెద్దఅంబర్పేట , జనవరి 27: కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని తులేఖుర్దు, యాచారం గ్రామా ల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలో కార్యక్రమం కొనసాగుతున్న తీరు ను మండల వైద్యాధికారి ప్రియాంకను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన ప్రభుత్వ దవాఖానను సందర్శిం చి.. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని.. వైద్యులు, సిబ్బంది నిత్యం అం దుబాటులో ఉండాలని సూచించారు.
అంధత్వ రహిత తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేయడంతోపాటు అవసరమై న వారికి మందులు, కంటి అద్దాలను పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంతో పేదల జీవితాల్లో వెలుగులు నిండుతాయన్నారు. యాచారంలో 121 మందికి, తులేఖుర్దులో 127మందికి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైద్యులు ప్రియాంక, స్వరాజ్యలక్ష్మి, హెచ్ఈవో శ్రీనివాస్, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.