కొత్తూరు రూరల్ : తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని ఇన్ముల్నర్వ గ్రామంలో మంగళవారం కొత్తూరు వైస్ఎంపీపీ శోభలింగంనాయక్, టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ రషీద్ ఆధ్వర్యంలో ఆయా పార్టీలకు చెందిన సుమారు 50మంది నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు దేశానికే ఆదర్శమన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయలేని అభివృద్ధి, సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రతిపథకం గడపగడపకు చేరుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నాడన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరే విధంగా చర్యలను తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మధుసూదన్రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎమ్మె సత్యనారాయణ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మెండె కృష్ణ, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.