మోమిన్పేట : దేవాలయాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ఎన్కతల గ్రామం శ్రీశనైశ్వర స్వామి ఆలయ నూతన పాలకవర్గ కమిటీని ఏర్పటు చేసి ఆలయ కమిటీ చైర్మన్గా పట్లోళ్ల మహిపాల్రెడ్డి, కమిటీ సభ్యులు రుక్మిణీ, రవిచందర్, వెంకటేశం, రాములు, మల్లయ్యగౌడ్, చంద్రయ్యలను ఎమ్మెల్యే సమక్షంలో ఎన్నుకున్నారు. పాలకవర్గం సభ్యులతో జిల్లా దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ మధుబాబు ప్రమాణ శ్రీకారం చేయించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నూతన పాలకవర్గం సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ దేవాలయాల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. దర్శనానికి ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యలు కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ మాట్లాడుతూ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. స్వలాభల కోసం కాకుండా దేవాలయం అభివృద్ధికి ఎల్లావేళాల కృషి చేస్తానని తెలిపారు.
కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వెంకట్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు నర్సింహా రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సర్పంచ్ అలివేళమ్మ, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, దేవాదయశాఖ అధికారులు పాల్గొన్నారు.