ఇబ్రహీంపట్నంరూరల్ : అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటిలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 11 వరకు రూ. 200 అపరాద రుసుముతో గడువు పెంచినట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభు, స్టడీసెంటర్ కో-ఆర్డీనేటర్ నాగోజి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్, ఓపెన్ ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు నేరుగా డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం పొందవచ్చునని తెలిపారు. అదే విధంగా ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు ట్యూషన్ ఫీజు ఈ నెల 11వరకు చెల్లించాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 7382929772నెంబర్ను సంప్రదించాలని కోరారు.