పెద్దఅంబర్పేట : పెద్దఅంబర్పేట చౌరస్తాలో మంగళవారం ఓ డీసీఎం అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. హయత్నగర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వైపు కూరగాయల లోడుతో వెలుతున్న ఏపీ39టీఎఫ్ 1517 నంబర్ గల డీసీఎం అదుపుతప్పి చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్నీ ఢీకొని ముందుకు వెల్లింది. విగ్రహాం ముక్కలు ముక్కలుగా విరిగి శకలాలు రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయాయి. అంతేకాకుండా కూరగాయల బస్తాలు రోడ్డుపై చిందరవందరగా రోడ్డంతా పడిపొయాయి. రోడ్డుపై పెద్దగా జన సంచారం లేకపోవడంతో ప్రాణనష్టం, ఆస్తి నష్టం గాని సంభవించలేదు. అంతేకాకుండా రోడ్డు అవుతలివైపు అదుపు తప్పి వెల్లినా పెద్ద ఎత్తున ప్రమాదం జరిగి ఉండేది.
విషయం తెలుసుకున్న స్థానికులు పెద్దఎత్తున సంఘటన ప్రదేశానికి చేరుకుని భైఠాయించారు. విగ్రహాన్ని యథావిధిగా ఉన్న స్థలంలోనే ఏర్పాటు చేయాలని జాతీయ రహదారిపై బైఠాయించారు. హయత్నగర్ పోలీసులు ఇచ్చి స్థానిక పెద్దలకు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.