బొంరాస్ పేట : కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని, అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డిని కోరారు. మంగళవారం హైదరాబాద్లో మంత్రిని కలిసి శాలువాతో సత్కరించారు. నియోజకవర్గంలోని కోస్గి, కొడంగల్ మార్కెట్ యార్డుల్లో గోదాముల నిర్మాణానికి మార్కెట్ కమిటీలకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే మంత్రిని కోరారు. అదే విధంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను, ప్రధాన సమస్యలను ఎమ్మెల్యే మంత్రికి వివరించి పరిష్కారానికి కృషి చేయాన్నారు.
నిధుల మంజూరుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే నరేందర్రెడ్డి తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో కోస్గి మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి, మద్దూరు మండల టీఆర్ఎస్ నాయకుడు బాల్సింగ్ నాయక్, కొడంగల్ మున్సిపల్ కౌన్సిలర్ మధుయాదవ్ ఉన్నారు.