ఇబ్రహీంపట్నం, జనవరి 18 : ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్పెషల్ సమ్మరి రివిజన్లో భాగంగా ఈనెల 6న ఓటరు జాబితా ప్రచురితం కాగా అభ్యంతరాల కోసం ఈ నెల 22 వరకు అవకాశముందన్నారు. నకిలీ, చనిపోయిన వారి పేర్లను తొలగించి అర్హులైన వారిని ఓటరు జాబితాలో నమోదు చేయించాలన్నారు.
ఓటరు జా బితా సవరణపై రాజకీయ పార్టీల నాయకులు ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు. రాజకీయ పార్టీలు బూత్స్థాయిలో ఏజెంట్లను నియమించుకుని.. ప్రస్తుతం ఉన్న పోలింగ్ కేంద్రాలను క్షేత్ర స్థా యిలో పరిశీలించుకోవాలని సూచించారు. 1450పైచిలుకు ఓట ర్లు కలిగిన చోట కొత్త పోలింగ్ స్టేషన్ను ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గం వారీగా ప్రతివారం పొలిటికల్ లీడర్లతో మీటింగ్ నిర్వహించి అన్ని విషయాలను వెల్లడిస్తామన్నారు.
ఈనెల 20, 21 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో స్పెషల్ క్యాంపెయిన్లను నిర్వహిస్తామని..అక్కడ ఓటరు జాబితాతోపాటు బీఎల్వోలు అందుబాటులో ఉంటారన్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్క రూ తమ ఓటు హక్కును నమోదు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడు తూ అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికలు కూడా సక్సెస్ అయ్యేలా రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో సంగీత, ఎన్నికల విభాగం అధికారులు, పలు పార్టీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.