చేవెళ్ల టౌన్ : సీఎం సహాయ నిధితో పేదల ఆరోగ్యానికి భరోసా కలుగుతుందని ఎమ్మెల్యే యాదయ్య అన్నారు. ఈ సందర్భంగా శనివారం చేవెళ్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేవునిఎరవల్లి గ్రామానికి చెందిన దండు కిష్టమ్మ అనారోగ్యంతో దవాఖానలో చేరి సీఎం సహాయ నిధికి సర్పంచ్ సామ మాణిక్యరెడ్డి చొరవతో దరఖాస్తు చేసుకోవడంతో రూ. 60 వేలు మంజూరయ్యాయి. దానికి సంబంధించిన చెక్కును బాధితులకు శనివారం ఎమ్మెల్యే యాదయ్య అందజేశారు. దేవునిఎరవల్లి టీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు శ్రీశైలం, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.