హయత్నగర్ రూరల్ : అబ్దుల్లాపూర్మెట్ మండలం గౌరెల్లికి చెందిన గ్యార సుమలతకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి శుక్రవారం రూ. 1.5లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేశారు. సుమలత భర్త మహేశ్ కొన్ని నెలల కిందట అనారోగ్యం బారినపడటంతో వైద్యం కోసం భారీగా డబ్బు ఖర్చు చేశారు. చికిత్స పొందుతూ మహేశ్ మృతిచెందాడు. బాటసింగారం రైతు సేవా సహకార సంఘం అధ్యక్షుడు లెక్కల విట్టల్రెడ్డి చొరవతో బాధితులు సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేశారు.
మంజూరైన చెక్కును బాధిత కుటుంభానికి అందజేశారు. కార్యక్రమంలో సర్పంచి తుడుము మల్లేశ్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నిరుడు యాదగిరి, టీఆర్ఎస్వీ మండల జనరల్ సెక్రటరీ వినోద్కుమార్, నాయకుడు అశోక్ పాల్గొన్నారు.