ఇబ్రహీంపట్నం : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజలకు కొండంత అండగా నిలుస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంచాల మండలంలోని ఎల్లమ్మతండా గ్రామానికి చెందిన ఎస్. నానుకు రూ. 60వేలు, ఎస్. శ్రీధర్కు రూ. 60వేల చొప్పున ప్రభుత్వం నుంచి సీఎం సహాయనిది కింద మంజూరైన చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్పొరేట్ వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉన్న ఎంతోమంది పేద ప్రజలకు ఈ పథకం కింద ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు శ్రీధర్ పాల్గొన్నారు.