ఇబ్రహీంపట్నంరూరల్ : స్వచ్ఛంద సంస్థలు సేవాభావంతో ముందుకుసాగి పేద ప్రజలకు సేవలందించాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. నవ్యఫౌండేషన్ 10వార్షికోత్సవం కార్యక్రమాన్ని ఫౌండేషన్ చైర్పర్సన్ మడుపు శ్రీరమ్య, కార్యదర్శి వేణుగోపాల్ల ఆధ్వర్యంలో ఆదివారం ఇబ్రహీంపట్నంలోని వీకే కన్వెన్షన్హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం ప్రాంతంలో నవ్యఫౌండేషన్ స్థాపించి పదేళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి సేవలు చేయడం అభినందనీయమన్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా మడుపు శ్రీరమ్య వేణుగోపాల్రావులు కరోనా ఆపత్కాలంలో కూడా పేద ప్రజలకు అండగా నిలిచారన్నారు. పది సంవత్సరాలుగా ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ పేద ప్రజలకు అండగా నిలువడం సంతోషకరమన్నారు.
నవ్యఫౌండేషన్ సేవలు రానున్న రోజుల్లో మరిన్ని నిర్వహించాలని కోరారు. ఈ ఫౌండేషన్ను స్ఫూర్తిగా తీసుకుని సేవభావంతో ప్రజలు ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, సత్తు వెంకటరమణారెడ్డితో పాటు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.