ఆమనగల్లు : ఆమనగల్లు మండలంలోని మేడిగడ్డ తండా సమీపంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 20 గంజాయి ప్యాకేట్లను స్వాదీనం చేసుకున్నట్లు గురువారం సీఐ ఉపేందర్ తెలిపారు. వెల్దండ మండలంలోని పల్గుతండాకు చెందిన ఇద్దరూ వ్యక్తులు కొన్ని రోజులుగా గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఎస్సై ధర్మేశ్ ఆధ్వర్యంలో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరూ వ్యక్తులను పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద ఉన్న 250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని తాసిల్దార్ పాండునాయక్ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించినట్లు సీఐ పేర్కొన్నారు.
ప్రధాన నిందితుడు పరారిలో ఉన్నాడని నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశామన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. ఆమనగల్లు సర్కిల్ పరిధిలో గంజాయి క్రయ, విక్రయాలు జరిపిన, గంజాయి సాగు చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.